ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్స హించేందుకు నడుం బిగించింది. కొత్తగా `షైనింగ్ స్టార్` అవార్డులను ప్రకటించింది. వీటిని 10, ఇంటర్ చదవి విద్యార్థులకు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు.. విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
గత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఈ అవార్డులను ఇవ్వనున్నారు. అంటే.. 2024-25 విద్యాసంవత్సరం నుంచే `షైనింగ్ స్టార్` అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులు ఇస్తారు. అవార్డు కింద.. మెమొంటో సహా 20 వేల రూపాయల నగదును కూడా విద్యార్థులకు అందిస్తారు. తద్వారా వారి ఉన్నత చదువులకు ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
ఎలా ఎంపిక చేస్తారు?
+ పదో తరగతిలో 500 పైన మార్కులు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు.
+ అన్ని సామాజిక వర్గాల్లోని విద్యార్థులను ఈ అవార్డులకు అర్హులుగా పేర్కొన్నారు.
+ మండలాల వారీగా ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
+ ఒక్కొక్క మండలం నుంచి ఆరుగురు పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
+ ఎంపిక చేసిన విద్యార్థుల్లో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులు ఉండేలా చూస్తారు.
+ అయితే, ఇంటర్ విద్యార్థులను మాత్రం.. ప్రతి జిల్లాకు 36 మంది చొప్పున ఎంపిక చేస్తారు.
This post was last modified on June 6, 2025 8:05 pm
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…