Political News

నాడు ‘లడ్డూ’ తయారీకి వాడింది నెయ్యే కాదట!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా ఓ మంచి గుర్తింపు ఉంది. తిరుమల లడ్డూకు ఉన్న రుచి మరే లడ్డూకు రాదు. రాబోదు కూడా. భక్త కోటి మహా ప్రసాదంగా పరిగణించే వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీకి ఎంపిక చేసిన విక్రయదారుల నుంచే దినుసులను టీటీడీ కొనుగోలు చేస్తుంది. 2019 దాకా అంతా బాగానే జరిగినా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పుణ్యమా అని తిరుమల లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యి కాకుండా కల్తీ నెయ్యిని వాడారు. ఇది నిన్నటిదాకా ఆరోపణే. నేడు అది నిజం. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం ఏపీ హైకోర్టుకు ఇదే విషయాన్ని వెల్లడించింది.

కూటమి సర్కారు అధికారంలోకి రాగానే.. టీటీడీలో అప్పటిదాకా జరిగిన పలు అక్రమాలు బయటకు రాగా… తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణ కలకలం రేపింది. దీనిపై రాజకీయ పరంగానే ఓ రేంజిలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. అంతిమంగా సుప్రీంకోర్టుకు ఈ విషయం చేరగా.. తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ, ఏపీ పోలీస్, ఫోరెన్సిక్ నిఫుణులను నియమించింది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు తమకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేయగా… సిట్ కౌంటర్ దాఖలు చేసింది,. ఈ కౌంటర్ లోనే తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని… అసలు అది నెయ్యే కాదని కూడా సిట్ తేల్చి చెప్పింది.

వాస్తవానికి బోలేబాబా డెయిరీ గతంలో తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును పొందింది. అయితే ఆ సంస్థ చేసిన కొన్ని జిమ్మిక్కులను గుర్తించిన టీటీడీ దానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇక వైసీపీ హయాంలో ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలు నెయ్యి సరఫరా కాంట్రాక్టును పొందగా… వైసీపీ నేతల వత్తాసుతో బోలేబాబా డెయిరీ మళ్లీ తన చక్రాన్ని తిప్పింది. పామాయిల్, ఇతర రసాయనాలతో కల్తీ నెయ్యిని తయారు చేసి దానిని ఏఆర్, వైష్ణవి డెయిరీల ద్వారా తిరుమలకు సరఫరా చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ ఈ వ్యవహారం గుట్టుగా సాగింది. బోలేబాబా డెయిరీకి జీహుజూర్ అన్న వైసీపీ నేతల మద్దతుతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోయింది.

అయితే 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడంతో బోలేబాబా డెయిరీ అక్రమాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కూటమి సర్కారు సీరియస్ గా తీసుకుంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే తిరుమల ఆయల మెట్లను కడిగి మరీ తనదైన శైలి నిరసనను తెలిపారు. వెరసి ఈ వ్యవహారం దేశవ్యాప్త సమస్యగా మారిపోయింది. ఎక్కడికక్కడ తిరుమల లడ్డూ తయారీ గురించే చర్చ సాగింది. చివరాఖరుకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు చేరగా.. సిట్ ఏర్పాటు, కల్తీ నెయ్యి వ్యవహారం ఆరోపణ కాదు నిజం అని తేలిపోయింది. ఇక నిందితులంతా పలుకుబడి కలిగిన వారని, వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.

This post was last modified on June 6, 2025 2:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

23 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

2 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago