అదేంటో గానీ తెలుగు నేలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా కుప్పకూలి పడిపోతున్నారు. నిన్నటికి నిన్న ఏపీలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో మైకు పట్టుకుని మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా గురువారం తెలంగాణ వంతు వచ్చినట్టుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మహిళా నేత, మంత్రి కొండా సురేఖ సచివాలయంలో కుప్పకూలి కింద పడిపోయారు. కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం అవుతుందనగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన సురేఖ… తన కార్యాలయానికి వెళ్లే క్రమంలోనే దారి కుప్పకూలారట. దీంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను లేపి కార్యాలయంలోకి తీసుకెళ్లిన వ్యక్తిగత సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమెకు కొంత ఆహారం పెట్టగా… కాసేపట్లోనే ఆమె తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎంచక్కా కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు.
అయినా కొండా సురేఖ ఎందుకు కిందపడ్డారన్న విషయానికి వస్తే…ఆమెకు షుగర్ తో పాటు లోబీపీ కూడా ఉందట. డయాబెటీస్, బీపీ హెచ్చుతగ్గులు ఉన్న వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అయితే గురువారం ఉదయం నుంచి ఆమె ఎంత బిజీగా ఉన్నారో గానీ… ఉదయం నుంచి ఆహారమే తీసుకోలేదట. దీంతో షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటుగా బీపీ పడిపోయిందట. ఫలితంగా కళ్లు తిరిగినట్టైన సురేఖ..నడుస్తూనే అలా కుప్పకూలిపోయారు. ఈ కారణంగానే కాస్తంత ఆహారం అందగానే ఆమె తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సహా, పలువురు మంత్రులు సురేఖను పరామర్శించారు.
ఇదిలా ఉంటే.. ఇటు కొండా సురేఖ అయినా, అటు బొత్స సత్యనారాయణ అయినా… వయసురీత్యా పెరుగుతున్న అనారోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు గమనిస్తూనే ముందుకు సాగాల్సి ఉంది. అయితే ఓ వైపు షుగర్, మరోవైపు బీపీ సమస్యలు పెట్టుకుని కూడా సురేఖ ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం చూస్తుంటే…ఆమె తన ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే చెప్పాలి. ఇటు బొత్స సత్యనారాయణ విషయానికి వచ్చినా… తాను కూడా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం నాడు ఎండ దంచికొడుతోంది. జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాల్సిన బొత్స.. అవేవీ పట్టించుకోకుండానే మండుటెండలో ప్రసంగానికి దిగారు. ఎండవేడిమికి తట్టుకోలేక కుప్పకూలిపోయారు.
This post was last modified on June 5, 2025 8:24 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…