Political News

నేతలు ఇలా పడిపోతున్నారేంటి?.. ఈ రోజు కొండా వంతు!

అదేంటో గానీ తెలుగు నేలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా కుప్పకూలి పడిపోతున్నారు. నిన్నటికి నిన్న ఏపీలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో మైకు పట్టుకుని మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా గురువారం తెలంగాణ వంతు వచ్చినట్టుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మహిళా నేత, మంత్రి కొండా సురేఖ సచివాలయంలో కుప్పకూలి కింద పడిపోయారు. కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం అవుతుందనగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన సురేఖ… తన కార్యాలయానికి వెళ్లే క్రమంలోనే దారి కుప్పకూలారట. దీంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను లేపి కార్యాలయంలోకి తీసుకెళ్లిన వ్యక్తిగత సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమెకు కొంత ఆహారం పెట్టగా… కాసేపట్లోనే ఆమె తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎంచక్కా కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. 

అయినా కొండా సురేఖ ఎందుకు కిందపడ్డారన్న విషయానికి వస్తే…ఆమెకు షుగర్ తో పాటు లోబీపీ కూడా ఉందట. డయాబెటీస్, బీపీ హెచ్చుతగ్గులు  ఉన్న వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అయితే గురువారం ఉదయం నుంచి ఆమె ఎంత బిజీగా ఉన్నారో గానీ… ఉదయం నుంచి ఆహారమే తీసుకోలేదట. దీంతో షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటుగా బీపీ పడిపోయిందట. ఫలితంగా కళ్లు తిరిగినట్టైన సురేఖ..నడుస్తూనే అలా కుప్పకూలిపోయారు. ఈ కారణంగానే కాస్తంత ఆహారం అందగానే ఆమె తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సహా, పలువురు మంత్రులు సురేఖను పరామర్శించారు.

ఇదిలా ఉంటే.. ఇటు కొండా సురేఖ అయినా, అటు బొత్స సత్యనారాయణ అయినా… వయసురీత్యా పెరుగుతున్న అనారోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు గమనిస్తూనే ముందుకు సాగాల్సి ఉంది. అయితే ఓ వైపు షుగర్, మరోవైపు బీపీ సమస్యలు పెట్టుకుని కూడా సురేఖ ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం చూస్తుంటే…ఆమె తన ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే చెప్పాలి. ఇటు బొత్స సత్యనారాయణ విషయానికి వచ్చినా… తాను కూడా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం నాడు ఎండ దంచికొడుతోంది. జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాల్సిన బొత్స.. అవేవీ పట్టించుకోకుండానే మండుటెండలో ప్రసంగానికి దిగారు. ఎండవేడిమికి తట్టుకోలేక కుప్పకూలిపోయారు.

This post was last modified on June 5, 2025 8:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago