తాజాగా విడుదలైన థగ్ లైఫ్ మీద రామ్ చరణ్ అభిమానులు ముందు నుంచే కన్నేశారు. ఎందుకంటే దీనికి సంగీతం అందించిన ఏఆర్ రెహమానే పెద్దికి స్వరకర్త కాబట్టి. కమల్ మూవీకి బెస్ట్ ఇచ్చి ఉంటే నిశ్చింతగా హమ్మయ్యా అనుకోవచ్చనుకున్నారు. కమల్ మూవీకి ఒకప్పుడు భారతీయుడు, తెనాలి లాంటి సూపర్ ఆల్బమ్స్ ఇచ్చిన రెహమాన్ ఇప్పుడు అదే మేజిక్ చేయాలని ఆశించడంలో తప్పు లేదు. తీరా చూస్తే థగ్ లైఫ్ లో పాటలు, బీజీఎమ్ రెండు ఒకదాంతో మరొకటి పోటీపడి నీరసంగా సాగాయి. అక్కడక్కడా తన మార్క్ కొంత వినిపించినా ఓవరాల్ గా చూసుకుంటే తీవ్రంగా నిరాశ పరిచిన మాట వాస్తవం.
మణిరత్నం అంతటి లెజెండరీనే రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోలేకపోతే ఇక బుచ్చిబాబు లాంటి ఒక్క సినిమా దర్శకుడు ఎలాంటి ట్యూన్స్ చేయిస్తాడోననే సందేహం రావడం సహజం. పెద్ది టీజర్ ఆ భయాన్ని కొంతమేర పోగొట్టింది. చిన్న వీడియోనే అయినా రెహమాన్ ఇచ్చిన స్కోర్ బాగా కుదిరింది. బుచ్చిబాబు వెంటపడి రెండు మూడు ట్యూన్స్ వద్దనుకున్నాక ఇది ఫైనల్ అయ్యిందని, అదే తరహాలో పాటలు కూడా తీసుకుంటాడనే నమ్మకం మెగా ఫాన్స్ లో ఉంది. అసలే రెహమాన్ కు తెలుగులో స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ లేదనే నెగటివ్ సెంటిమెంట్ సూపర్ పోలీస్ నుంచి కొమరం పులి దాకా కొనసాగుతూనే ఉంది.
మధ్యలో సాహసం శ్వాసగా సాగిపో, ఏ మయ చేశావే లాంటి డీసెంట్ హిట్స్ ఉన్నాయి కానీ రికార్డులు బద్దలు కొట్టినవి లేదు. ఇప్పుడు పెద్ది దాన్ని తిరగరాయాలి. మూడు పాటల రికార్డింగ్ గత ఏడాదే పూర్తయ్యింది. ఉప్పెనకు బుచ్చిబాబు చేయించుకున్న సాంగ్స్ ఏ స్థాయిలో హిట్టయ్యాయో చూశాం. మరి పెద్దికి కూడా అదే జరిగితే సంతోషమే. వచ్చే ఏడాది మార్చి 27 విడుదల కాబోతున్న ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ నలభై శాతం దాకా పూర్తయ్యింది. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ చేశారు. ఒకవేళ వింటేజ్ రెహమాన్ కనక పెద్దిలో వినిపిస్తే మ్యూజిక్ లవర్స్ కు అంతకన్నా శుభవార్త ఏముంటుంది.
This post was last modified on June 5, 2025 5:08 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…