Political News

ఏ పధకమైనా ఫీడ్ బ్యాక్ తప్పనిసరి

అధికారంలోకి వస్తున్న ఆయా రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఏవో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం… వాటిని వీలయినంత మేరకు కొనసాగించడం, ఆపై తిరిగి ఎన్నికలకు వెళ్లడం… ఇదే ఇప్పటిదాకా మనం చూస్తున్నది. ఇటీవలే ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత కూడా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశానని, అయినా తాను ఓడిపోయానంటూ ఆవేదన పడిపోయారు. అంటే ఎక్కడో లెక్క తప్పినట్టే కదా. ఆ తప్పిన లెక్కేమిటంటే… అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు ఏ మేర సంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని జగన్ పట్టించుకోలేదు.

ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి జగన్ చేసిన తప్పును పునరావృతం చేసేందుకు సిద్ధంగా లేదనే చెప్పాలి. తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలను అమలు చేస్తూనే… ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో దూసుకుపోతోంది. గత కొంత కాలం క్రితం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రవేశపెట్టిన కూటమి సర్కారు… ఆ పథకంపై జనం ఏమనుకుంటున్నారు అన్న ఫీడ్ బ్యాక్ ను సేకరించింది. అంతే జనం అభిప్రాయం మేరకు ఏడాది 3 సిలిండర్లు ఇవ్వనున్న ప్రభుత్వం ఆ 3 సిలిండర్లకు అయ్యే మొత్తాన్ని ఒకే దఫా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఇక తాజాగా రేషన్ అక్రమాలకు చెక్ పెట్టే దిశగా వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి తిలోదకాలిచ్చిన కూటమి సర్కారు… గతంలో మాదిరిగానే రేషన్ డీలర్ షాపుల వద్దే సరుకుల పంపిణీని ఈ నెల 1న లాంఛనంగా ప్రారంభించింది. అంతటితోనే కూటమి సర్కారు తన పని అయిపోయిందని అనుకోలేదు. వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ పద్దతి బాగుందా?.. డీలర్ షాపుల వద్ద సరుకుల పంపిణీ బాగుందా? అన్న విషయాలపై సివిల్ సప్లైస్ శాఖ జనం నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తోంది. పనిలో పనిగా డీలర్లు ఇస్తున్న బియ్యం, ఇతరత్రా రేషన్ సరుకుల నాణ్యత కూడా ఎలా ఉందన్న దానిపైనా ఆరా తీయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫీడ్ బ్యాక్ ను త్వరలోనే ఆయన సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు.

వాస్తవానికి ఇళ్ల వద్దే రేషన్ సరుకుల పంపిణీ మంచి పథకమే అయినప్పటికీ అమలులో ఆ పథకం అభాసుపాలైందని చెప్పాలి. ఏదో వాహనాలు కొనేసి యువకులకు అప్పించేసి.. రేషన్ సరుకులు ఇచ్చేసి పంపిణీ చేయండి అంటూ చెప్పేశారు. ఆ తర్వాత అసలు ఈ పథకం ఎలా అమలు అవుతుందన్న దానిపై ఆయన అసలు దృష్టి సారించిన పాపానే పోలేదు. యథా రాజదా తథా ప్రజ అన్నట్లుగా సీఎం పట్టించుకోకుంటే తమకెందుకు అన్నట్లుగా మంత్రులు గానీ, అదికార యంత్రాంగం గానీ ఈ పథకం అమలు తీరును అసలు పట్టించుకోలేదు. ఫలితంగా తొలి వారం, రెండో వారం ఓ మోస్తరుగా సరుకుల పంపిణీ మంచిగానే జరిగినా… ఆ తర్వాత తమ మీద నిఘా లేదని గ్రహించిన వాహనదారులు రేషన్ సరుకులను బ్లాక్ మార్కెట్ కు తెరలించే దిశగా సాగారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

This post was last modified on June 3, 2025 11:08 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

2 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

4 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

6 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

9 hours ago