Political News

వైఎస్ మారాడు.. జ‌గ‌న్ కూడా మారాలి..: జేసీ ప్ర‌భాక‌ర్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంత‌పురం జిల్లాకు చెందిన, టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్న‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్టాడుతూ.. “జ‌గ‌న్ మారాలి. లేక‌పోతే.. క‌ష్ట‌మే. ఇంకా బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే.. ప్ర‌జ‌లు ఒప్పుకోరు. ప్ర‌జ‌లు కూడా ర‌క్ష‌ణ కోరుకుంటున్నారు. బెదిరింపుల‌తో రాజ‌కీయాలు చేయ‌లేరు. ఆ రోజులు పోయాయి. వాళ్ల నాయ‌న కూడా మారాడు. అందుకే ప్ర‌జ‌లు యాక్స‌ప్ట్ చేశారు” అని జేసీ వ్యాఖ్యానించారు.

పోలీసుల‌ను, అధికారుల‌ను బెదిరించ‌డం వ‌ల్ల జ‌గ‌న్ కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని జేసీ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అభివృద్దిని కోరుకుంటున్న ప్ర‌జ‌లు.. జ‌గ‌న్‌ను ఎందుకు ప‌క్కన పెట్టారో తెలుసుకోవ‌డం ఈజీనేని చెప్పారు. అంద‌రికీ ఈ విష‌యంపై క్లారిటీ ఉంద‌ని.. కానీ జ‌గ‌న్‌కే క్లారిటీ లేద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా మార్పు దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయ‌క‌పోతే.. ఆయ‌న‌తో పాటు పార్టీలో ఉన్న‌వారు కూడా.. భూస్థాపితం అయిపోతార‌ని అన్నారు. “మేమేం చేస్తాం. ప్ర‌జ‌లే చేస్తారు. అంద‌రూ చూస్తున్నారు. ఏడాది అయింది. సింప‌తీలేదు. పైగా బెదిరింపులు. ఎవ‌రు మాత్రం ఇష్ట‌ప‌డ‌తారు?” అని జేసీ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ప్ర‌జ‌ల్లోకి రావ‌డానికి జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక టీడీపీ నాయ‌కుడిగా తాను జ‌గ‌న్ గురించి మాట్లాడ‌డం లేద‌న్న జేసీ.. వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా విజ‌య‌మ్మ మొహం చూసి జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇస్తున్నాన‌ని చెప్పారు. “పార్టీలో అంద‌రూ మంచోళ్లే. కానీ, …..డే మొండి ఘ‌టం. ఎవ‌రి మాట విన‌డు. చెబితే అర్ధం చేసుకోడు. ఏం చేస్తారు పాపం.” అని జేసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూట‌మి మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని చెప్పారు. ప‌థ‌కాలు, సంక్షేమం ఇవ‌న్నీ కాద‌ని.. అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటున్నార‌ని చెప్పారు. “ఒక ఇంట్లో 20 వేలు సంపాయించుకునే ఉద్యోగం కావాలా.. ఏడాదికి 10 వేలు ఇచ్చే సంక్షేమం కావాలా?” అని జేసీ ప్ర‌శ్నించారు.

Satya

Recent Posts

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

2 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

2 hours ago

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…

3 hours ago

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

4 hours ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

5 hours ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

6 hours ago