Political News

వైఎస్ మారాడు.. జ‌గ‌న్ కూడా మారాలి..: జేసీ ప్ర‌భాక‌ర్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంత‌పురం జిల్లాకు చెందిన, టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్న‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్టాడుతూ.. “జ‌గ‌న్ మారాలి. లేక‌పోతే.. క‌ష్ట‌మే. ఇంకా బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే.. ప్ర‌జ‌లు ఒప్పుకోరు. ప్ర‌జ‌లు కూడా ర‌క్ష‌ణ కోరుకుంటున్నారు. బెదిరింపుల‌తో రాజ‌కీయాలు చేయ‌లేరు. ఆ రోజులు పోయాయి. వాళ్ల నాయ‌న కూడా మారాడు. అందుకే ప్ర‌జ‌లు యాక్స‌ప్ట్ చేశారు” అని జేసీ వ్యాఖ్యానించారు.

పోలీసుల‌ను, అధికారుల‌ను బెదిరించ‌డం వ‌ల్ల జ‌గ‌న్ కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని జేసీ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అభివృద్దిని కోరుకుంటున్న ప్ర‌జ‌లు.. జ‌గ‌న్‌ను ఎందుకు ప‌క్కన పెట్టారో తెలుసుకోవ‌డం ఈజీనేని చెప్పారు. అంద‌రికీ ఈ విష‌యంపై క్లారిటీ ఉంద‌ని.. కానీ జ‌గ‌న్‌కే క్లారిటీ లేద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా మార్పు దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయ‌క‌పోతే.. ఆయ‌న‌తో పాటు పార్టీలో ఉన్న‌వారు కూడా.. భూస్థాపితం అయిపోతార‌ని అన్నారు. “మేమేం చేస్తాం. ప్ర‌జ‌లే చేస్తారు. అంద‌రూ చూస్తున్నారు. ఏడాది అయింది. సింప‌తీలేదు. పైగా బెదిరింపులు. ఎవ‌రు మాత్రం ఇష్ట‌ప‌డ‌తారు?” అని జేసీ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ప్ర‌జ‌ల్లోకి రావ‌డానికి జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక టీడీపీ నాయ‌కుడిగా తాను జ‌గ‌న్ గురించి మాట్లాడ‌డం లేద‌న్న జేసీ.. వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా విజ‌య‌మ్మ మొహం చూసి జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇస్తున్నాన‌ని చెప్పారు. “పార్టీలో అంద‌రూ మంచోళ్లే. కానీ, …..డే మొండి ఘ‌టం. ఎవ‌రి మాట విన‌డు. చెబితే అర్ధం చేసుకోడు. ఏం చేస్తారు పాపం.” అని జేసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూట‌మి మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని చెప్పారు. ప‌థ‌కాలు, సంక్షేమం ఇవ‌న్నీ కాద‌ని.. అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటున్నార‌ని చెప్పారు. “ఒక ఇంట్లో 20 వేలు సంపాయించుకునే ఉద్యోగం కావాలా.. ఏడాదికి 10 వేలు ఇచ్చే సంక్షేమం కావాలా?” అని జేసీ ప్ర‌శ్నించారు.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

24 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago