వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు ఎలా రెచ్చిపోయారో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ‘డెడ్ బాడీ డోర్ డెలివరీ’ వ్యవహారం మరింతగా కలకలం రేపింది. తన దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్ను వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ అనంతబాబు.. దారుణంగా హత్య చేసి.. శవాన్ని డోర్ డెలివరీ చేశారని.. అప్పట్లో విపక్షాలు తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశాయి.
పైగా డ్రైవర్ దళితుడు కావడంతో దళిత సామాజిక వర్గాలకు చెందిన వారు మరింతగా ఆందోళన చేశారు. అయినా.. వైసీపీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు.. చర్యలు తీసుకునేందుకు కూడా చాలా వెనుకాడింది. దళితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. సంకేతాలు అందిన తర్వాత కానీ… ఆయనను చూచాయగా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆ సస్పెన్షన్ను తిరిగి ఆరు మాసాలకే ఎత్తేశారు. గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నారు.
ఇక, హత్య కేసు ఏమైందంటే.. ఇప్పటికీ అంతుచిక్కదు. ఇదిలావుంటే.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం.. కేసును తిరగ దోడేందుకు ప్రయత్నాలు జరగుతున్నారు. మరోవైపు.. తాజాగా సుబ్రహ్మణ్యం సోదరుడు.. వీధి నవీన్ (34)కు ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇచ్చింది. స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇస్తూ.. తాజాగా అప్పాయింట్మెంటు ను కూడా అందించింది.
దీంతో సుబ్రహ్మణ్యం కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే.. కేసులో నిందితుడుగా ఉన్న అనంతబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడు తున్నారన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో అతనిని అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
This post was last modified on May 31, 2025 9:55 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…