Political News

మిల్లా మాగీపై విచార‌ణ పూర్తి.. ఏం జ‌రిగిందంటే!

మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణ‌లో తుది పోటీలు ఈ నెల 31న జ‌ర‌గ‌నున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ పోటీల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. బ్రిట‌న్‌కు చెందిన `మిస్ ఇంగ్లండ్‌` మిల్లా మాగీ.. ఈ పోటీల నుంచి మ‌ధ్యలోనే నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. అయితే.. పోతూ.. పోతూ.. కొన్ని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసింది. తెలంగాణ ఆతిధ్యం బాగుంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు మంచి వార‌ని.. ప్ర‌భుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసింద‌న్న మాగీ.. పోటీల‌పై మాత్రం తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

త‌న‌ను వేశ్య మాదిరిగా చూశార‌ని.. ధ‌న‌వంతులైన స్పాన్స‌ర్ల ప‌క్క‌న కూర్చుని వారిని అలరించేలా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించార ని.. ఆరోపించారు. అంతేకాదు.. త‌మ‌ను బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలోకూడా మేక‌ప్ తీయ‌కుండా బ‌ల‌వంతం చేశారని.. నిర్వాహ‌కుల‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీనికి సంబంధించి బ్రిట‌న్ ప‌త్రిక‌లు ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారం తెలంగాణ‌లో రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వంతో ముడిపెట్టిన బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కులు రేవంత్ రెడ్డి స‌ర్కారు దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ నేత‌లు కూడా విచార‌ణ‌కు డిమాండ్ చేయ‌డంతో స‌ర్కారు అదే ప‌నిచేసింది.

తాజాగా ఈ విచార‌ణ నివేదిక అందింది. ముగ్గురు ఐపీఎస్ మ‌హిళా అధికారుల‌తో మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ విచార‌ణ తాలూకు నివేదిక‌పై రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ స్పందించారు. దీనిలో అనేక విష‌యాలు వెలుగు చూశాయ‌న్నారు. ఆరోప‌ణ‌లు నిజ‌మో కాదో.. అనే విష‌యంపైనే తాము దృష్టి పెట్టామ‌ని.. నిర్వాహ‌కులు స‌హా స‌హ కంటెస్టెంట్ల నుంచి కూడా విచార‌ణాధికారులు వివ‌రాలు తెలుసుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. దీనిపై ప్ర‌భుత్వం కేవ‌లం విచార‌ణ‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని.. చ‌ర్య‌లు తీసుకోబోద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మిల్లా మాగీపై లండ‌న్ కోర్టులో మిస్ వ‌ర‌ల్డ్ నిర్వాహ‌కులు కేసు వేశార‌ని.. అక్క‌డ విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. నిర్వాహ‌కులు కోరితే.. తెలంగాణ ప్ర‌భుత్వం చేయించిన విచార‌ణ నివేదిక‌ను అందించే అవ‌కాశం ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి పొర‌పాట్లు రాకుండా.. ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యాల‌పైనా విచార‌ణాధికారులు త‌మ‌కు సూచ‌న‌లు చేశార‌ని చెప్పారు. దీంతో ప్ర‌స్తుత వివాదం స‌మ‌సిపోయిన‌ట్టుగానే భావిస్తున్న‌ట్టు రంజ‌న్ చెప్పారు. 

This post was last modified on May 30, 2025 7:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

6 minutes ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

25 minutes ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

1 hour ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

1 hour ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

2 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

4 hours ago