రాజకీయాల్లో తలపండిన నాయకుడు అని, తనకంటే వ్యూహ ప్రతివ్యూహాలు వేయగల నాయకుడు లేడని భావించే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏర్పడిన రాజకీయ కల్లోలంతో విషమ పరీక్షకు గురవుతున్నారు. ముందరి కాళ్లకు బంధంలా చుట్టుకున్న కుమార్తె, కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగినా, చివరికి బాధ్యత ఆయనపైనే పడుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది కేసీఆర్కే సమస్యగా మారుతోంది.
కవిత రాసిన లేఖ, ఆపై జరిగిన పరిణామాలు, ఆమె చేసిన వ్యాఖ్యలు — ఇవన్నీ కుమార్తె, కుమారుడికంటే కూడా కేసీఆర్ను ఎక్కువగా ఒత్తిడిలోకి నెట్టేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “తాను కేసీఆర్ నేతృత్వంలో తప్ప మరెవరితోనూ పని చేయను” అని తేల్చిచెప్పిన కవిత వ్యాఖ్యలు వెనుక అసలు ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే మాటలు వేరే నేతలు చెప్పినా, కేసీఆర్ నిర్ణయాలు గట్టిగానే ఉండేవి. కానీ కన్నబిడ్డ విషయానికొస్తే ఆయన తడబడుతున్నారని కనిపిస్తోంది.
తాజాగా కవిత చెప్పిన కీలక వ్యాఖ్య — “కేసీఆర్ తప్ప ఎవరు నన్ను నడపలేరు” — అన్నది. దీనికి అనుగుణంగా, కేసీఆర్ ఇక తీసుకునే నిర్ణయాలపై ఆడబిడ్డ అనే సెంటిమెంట్ ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు. ఇది మరింత క్లిష్ట పరిస్థితిని తెస్తోంది. అదే సమయంలో, ఆ సెంటిమెంట్ ఆధారంగా కవితను పార్టీకి సుప్రీం చేయాలనే ఆలోచన చేసినా, అది పార్టీ మొత్తానికి భారం అవుతుంది. అంటే, ఎటు చూసినా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
ఇకపై కవితపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకోవచ్చు అనే ప్రచారం ఒకప్పుడు సాగింది. పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన ఆమెపై కేసీఆర్ చర్య తీసుకుంటారని భావించారు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కేసీఆర్కు గట్టిపరీక్షగానే మారనుంది.
సెంటిమెంట్, రాజకీయ లెక్కలు, కుటుంబ బంధాలు అన్నీ కలిసొచ్చిన ఈ విషయంలో కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయం ఏమై ఉంటుందో చూడాలి.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…