Political News

ఇక, గేట్లు మూసేశారా? టీడీపీలో బిగ్ టాపిక్!

మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ఇతర పార్టీల నుంచి చేర్చుకునే నాయకుల విషయంలో ఆయన తేల్చిచెప్పేశారు. కోవర్టుల అంశాన్ని ఆయన ప్రధానంగా చర్చించారు. అంతేకాదు, సైలెంట్‌గా పార్టీ మారి వైలెంట్ వ్యవహారాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దీంతో ఇక, జంపింగులకు టీడీపీ గేట్లు మూసేసిందన్న చర్చ మహానాడులోనే జరుగుతుండటం గమనార్హం.

ఎందుకిలా?

గత ఏడాది ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయం చూసిన చాలా మంది నాయకులు సైలెంట్‌గా జెండా మార్చేశారు. వీరిలో చాలా మంది టీడీపీ జెండా కప్పుకొన్నారు. వాస్తవానికి ముందు వెనుక అన్నీ ఆలోచించుకున్నాకే టీడీపీలోకి నాయకులను ఆహ్వానించారు. ఇలానే పల్నాడు, నెల్లూరు జిల్లాల్లోనూ నాయకులను చేర్చుకున్నారు. కానీ, ఆ తర్వాత వారే టీడీపీ నాయకులను హత్య చేశారన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ.

పల్నాడులో జరిగిన జంట హత్యలు, నెల్లూరులో జరిగిన చౌదరి హత్యలకు కారణం గతంలో ఉన్న రాజకీయ విద్వేషాలేనని చంద్రబాబు వరకు చేరింది. అంటే, వైసీపీలో ఉండగా తీవ్రంగా విభేదించిన వారు తర్వాత పార్టీ మారారు. ఈ క్రమంలోనే ఆధిపత్య రాజకీయాల కోసం టీడీపీలో సంస్థాగతంగా ఉన్నవారిపై దాడులు చేసి హత్యలకు దిగారన్నది చంద్రబాబుకు రిపోర్టులు చేరాయి. ప్రస్తుతం వారి పై కేసులు పెట్టారు. అరెస్టుల వరకు విషయం వెళ్లింది.

కానీ, ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు కూడా పార్టీపై ఒకింత కినుక వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్నవారిని పార్టీలో చేర్చుకుంటే ఇదే జరుగుతుందన్న సమాచారం ఇచ్చారు. దీంతోనే పార్టీలోకి దాదాపు వైసీపీ నాయకులు ఎవరినీ చేర్చుకునే అవకాశం లేకుండా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అదేసమయంలో కోవర్టులు కూడా వారే అయి ఉంటారని, అందుకే తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి వచ్చేవారికి గేట్లు మూసేశారని స్పష్టంగా తెలుస్తోంది.

This post was last modified on May 29, 2025 10:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

37 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago