Political News

దటీజ్ టీడీపీ…మహానాడు వేదికపై కార్యకర్తకు గౌరవం

కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడూరు నుంచి కడపకు 60 ఏళ్ల వయసున్న టీడీపీ కార్యకర్త ఒకరు సైకిల్ తొక్కుకుంటూ మహానాడుకు వచ్చారని, ఇటువంటి కార్యకర్తలు ఉండడం పార్టీకి పూర్వజన్మ సుకృతం అని అన్నారు. మనందరం ఈ మాదిరిగానే ఉంటే వైఎస్ఆర్ సీపీకి అడ్రస్సే ఉండదు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో జోష్ నింపాయి.

సాధారణ కార్యకర్తలను టీడీపీ ఎప్పుడూ గౌరవిస్తుందని చంద్రబాబు మరోసారి నిరూపించారు. గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్న వైసీపీ నేతలపై అంజిరెడ్డి తాత తొడగొట్టిన వైనాన్ని కూడా చంద్రబాబు గతంలో ప్రస్తావించారు. తాజాగా మహానాడు సందర్భంగా కోడూరు నుంచి కడపకు సైకిల్ మీద వచ్చిన 60 ఏళ్ల పెద్దాయనను చంద్రబాబు గౌరవించారు.

ఈ వయసులో సైకిల్ తొక్కుకుంటూ మహానాడుకు వచ్చిన ఆ కార్యకర్తకు గౌరవసూచికంగా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని చంద్రబాబు సూచించారు. దీంతో వేదికపై ఉన్న లోకేశ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, సభకు హాజరైన వారు అందరూ లేచి ఆ పెద్దాయనను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహానాడు వంటి భారీ బహిరంగ సభలో ఒక సాధారణ కార్యకర్తకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు… దటీజ్ చంద్రబాబు అని టీడీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని చంద్రబాబు అన్నారు. కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామని చెప్పారు. కడపలో మహానాడు పెడుతున్నారా అని అంతా అనుకున్నారని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు పక్కన సముద్రం ఉందని, కానీ కడపలో ఈరోజు జనసంద్రం చూస్తున్నానని చంద్రబాబు చెప్పారు. పార్టీ శ్రేణులతో కడప ‘జన’ దిగ్బంధమైందని, అన్ని దారులు కడపవైపే ఉన్నాయని అన్నారు.

This post was last modified on May 29, 2025 5:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

57 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago