టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు మూడో రోజుకు చేరుకుంది. చివరి రోజు మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది హాజరు కావడంతో కడప మొత్తం పసుపుమయమైంది. ఈ సందర్భంగా ఈ సభలో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జెండా లేకుండా పీకేస్తాం అన్న పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని వైసీపీకి చురకలంటించారు. జెండా పీకేస్తాం అని అన్న వారు పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకొనే పరిస్థితి వచ్చిందని చురకలంటించారు. వై నాట్ 175 అన్న పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారని, ఇప్పుడు ప్రజలు వారిని ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని చురకలంటించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, దానికి బదులుగా జగన్ ను ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టి లాక్ చేశారని సెటైర్లు వేశారు. టీడీపీ నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరని, ట్రెండ్ సెట్ చేస్తారని లోకేష్ పంచ్ డైలాగ్ వేశారు. సినిమా స్క్రీన్ అయినా… పొలిటికల్ స్క్రీన్ అయినా ఒకే లెజెండ్ ఎన్టీఆర్ అని లోకేష్ చెప్పారు.
వైసీపీ నేతలు ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారని చెప్పిన లోకేశ్….ఎందుకయ్యా ఏడుస్తున్నారు అంటూ చురకలంటించారు. తాను కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటానని చెప్పానని, అలాగే చేస్తున్నానని అన్నారు. ఈ రోజు ఎర్ర రంగు చూస్తూనే వణికిపోయే పరిస్థితికి వైసీపీ నేతలు వచ్చారని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ అంటే ఒకడికి గుండెపోటు వచ్చిందని, ఒకడు బాత్రూంలో జారి చేయి విరగ్గొట్టెుకున్నాడని అన్నారు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికీ తెలుసు అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
తల్లిని చెల్లిని మెడబెట్టి గెంటేసింది ఎవరు? సొంత బాబాయ్ ను లేపేసింది ఎవరు? జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసింది ఎవరు? అని లోకేశ్ ప్రశ్నించగా…జగన్ అని జనం సమాధానమిచ్చారు.
This post was last modified on May 29, 2025 5:12 pm
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో తన నలభై ఏళ్ల బంధాన్ని తెంచుకుని మరీ బీఆర్ఎస్ గూటికి చేరువవుతున్నారు తెలంగాణ…
ఈ రోజుల్లో సినిమాల్లో సందేశాలు ఇస్తే..ఎవరు తీసుకుంటారు? మంచి చూపిస్తే ఎవరు నేర్చుకుంటారు అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది. అలాంటి…
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఇప్పుడున్న పరిస్థితుల్లో పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలు హీరోయిన్లకు దక్కడం చాలా అరుదైపోయింది. రష్మిక మందన్నకు గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టు…
పైరసీ గురించి మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సెన్సార్ వివాదం, తమిళనాడు ఎన్నికల వల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన…
బొత్స సత్యనారాయణ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు. ఒకప్పుడు విజయనగరం నుంచి విశాఖ వరకు కూడా ఆయన హవా…