బీఆర్ఎస్ మేలు కోరుకుంటున్నాను.. మా నాయకుడుగా కేసీఆర్ను మాత్రమే చూస్తున్నానని చెప్పిన కవిత.. తన మాటల ద్వారా అదే కేసీఆర్ను రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ ఇరుకున పడేశారా? ఆయన సమాధానం చెప్పుకొనే పరిస్థితికి కవిత తీసుకువచ్చారా? అంటే.. బీఆర్ ఎస్ నాయకులు అదే మాట అంటున్నారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు.. పార్టీలోను.. కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు నాయకుల్లోనూ చర్చకు వచ్చాయి.
కవిత చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా రెండు అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. 1) బీజేపీలో బీఆర్ ఎస్ను విలీనం చేయడం అనే ప్రతిపాదన వచ్చిందని చెప్పడం. దీనిని నాయకులు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఇది పూర్తిగా పార్టీలో అంతర్గత అంశమని.. దీనిని బయటకు చెప్పడం సరికాదని ముక్తకంఠంతో చెబుతున్నారు. “ఆమె కూడా మా నాయకురాలే. ఆమెకు బాధ ఉండొచ్చు. కానీ, అది వ్యక్తిగతం. కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ.. ఇప్పుడు అంతర్గత విషయాలు బయటకు చెప్పి. పార్టీని నాలుగు రోడ్ల కూడలిలో నిలబెట్టారు.“ అని కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
మరొకరు..“ కవిత, కేటీఆర్లు పార్టీలు నడపడం లేదు. ఇప్పుడు కేసీఆర్ బాధ్యుడు. ఆయన గౌరవం మాకు ముఖ్యం. బీజేపీతో చేతులు కలపాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే.. వాటిపైనే కవిత మాట్లాడాల్సి ఉంది. కానీ.. నాలుగు గోడలమధ్య చర్చించుకునే విషయాలు బయటకు ఎలా చెబుతుంది. ఇది తప్పు. ఇదే కొనసాగితే.. మాకు కూడా ఎన్నో విషయాలు చెప్పారు. అన్నీ బయట పెడితే పార్టీ ఉంటుందా?“ అని హైదరాబాద్కు చెందిన మాజీ మంత్రి, బీసీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
ఇక, రెండో విషయం.. నాయకుడిగా కేసీఆర్ను తప్ప.. మరొకరిని అంగీకరించేది లేదని కవిత చెప్పడం. దీనిపైనా బీఆర్ ఎస్ నాయకులు.. గుస్సాగా ఉన్నారు. “నాయకుడిగా కేసీఆర్ను అంగీకరించినప్పుడు.. ఆయన మాటను కూడా అంగీకరించాలని చెబుతున్నారు. ఆయనకు విలువనిస్తున్నామంటే.. ఆయన ఏం చేసినా అంగీకరించాలి కదా! మన ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ను నడవమని చెప్పలేం. అలా అనుకుంటే.. పార్టీలో 2 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వేలాది మంది నాయకులు ఉన్నారు. అందరూ కేసీఆర్ను శాసిస్తే.. ఎలా? ఇది తప్పు. కవిత హద్దులు మీరుతున్నారు.“ ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
మొత్తానికి కవిత వ్యవహారం.. నిన్న మొన్నటి వరకు సింపతీ వైపు మళ్లినా.. ఇప్పుడు అంతరంగిక విషయాలు బయటకు చెప్పడం, కేసీఆర్ను శాసించేలా ఆమె వ్యాఖ్యానించడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. మరి వీరంతా ఏం చేస్తారో.. చూడాలి.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…