సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని చూశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపాయి. ఇక, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చూస్తున్నారని, ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని కవిత చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
ఆఫ్ ద రికార్డ్ లో కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని రాజాసింగ్ అంగీకరించారు. భారీ ప్యాకేజీ ఇస్తే బీఆర్ఎస్ నేతలతో బీజేపీ నేతలు కలిసిపోతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు బీఆర్ఎస్ నేతలు డిసైడ్ చేస్తారని, గతంలో ఇలా చాలాసార్లు జరిగిందని రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా చేయబట్టే బీజేపీ నష్టపోయిందని, ప్రతి ఎన్నికలలో బీజేపీ నేతలు ఏదో ఒక పార్టీతో కుమ్మక్కవుతున్నారని, అందుకే పార్టీ నష్టపోయిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రావడం లేదు అనే కోణంలో బీజేపీ నేతలుంతా ఆలోచించాలని అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ ఏనాడో అధికారంలోకి రావాల్సి ఉందని చెప్పారు. అయితే, ఇతర పార్టీ నేతలతో బీజేపీ నేతలు కుమ్మక్కు కావడంతోనే అది జరగలేదని, ఆ సంగతి అందరికీ తెలుసు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అక్రమాస్తుల పంపకాల విషయంలో వచ్చిన కుటుంబ కలహాలను తన తండ్రి, సోదరుడు, బావతో చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు.
This post was last modified on May 29, 2025 4:08 pm
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్…
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…