సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని చూశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపాయి. ఇక, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చూస్తున్నారని, ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని కవిత చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
ఆఫ్ ద రికార్డ్ లో కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని రాజాసింగ్ అంగీకరించారు. భారీ ప్యాకేజీ ఇస్తే బీఆర్ఎస్ నేతలతో బీజేపీ నేతలు కలిసిపోతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు బీఆర్ఎస్ నేతలు డిసైడ్ చేస్తారని, గతంలో ఇలా చాలాసార్లు జరిగిందని రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా చేయబట్టే బీజేపీ నష్టపోయిందని, ప్రతి ఎన్నికలలో బీజేపీ నేతలు ఏదో ఒక పార్టీతో కుమ్మక్కవుతున్నారని, అందుకే పార్టీ నష్టపోయిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రావడం లేదు అనే కోణంలో బీజేపీ నేతలుంతా ఆలోచించాలని అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ ఏనాడో అధికారంలోకి రావాల్సి ఉందని చెప్పారు. అయితే, ఇతర పార్టీ నేతలతో బీజేపీ నేతలు కుమ్మక్కు కావడంతోనే అది జరగలేదని, ఆ సంగతి అందరికీ తెలుసు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అక్రమాస్తుల పంపకాల విషయంలో వచ్చిన కుటుంబ కలహాలను తన తండ్రి, సోదరుడు, బావతో చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు.
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…