సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని చూశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపాయి. ఇక, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చూస్తున్నారని, ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని కవిత చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
ఆఫ్ ద రికార్డ్ లో కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని రాజాసింగ్ అంగీకరించారు. భారీ ప్యాకేజీ ఇస్తే బీఆర్ఎస్ నేతలతో బీజేపీ నేతలు కలిసిపోతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు బీఆర్ఎస్ నేతలు డిసైడ్ చేస్తారని, గతంలో ఇలా చాలాసార్లు జరిగిందని రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా చేయబట్టే బీజేపీ నష్టపోయిందని, ప్రతి ఎన్నికలలో బీజేపీ నేతలు ఏదో ఒక పార్టీతో కుమ్మక్కవుతున్నారని, అందుకే పార్టీ నష్టపోయిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రావడం లేదు అనే కోణంలో బీజేపీ నేతలుంతా ఆలోచించాలని అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ ఏనాడో అధికారంలోకి రావాల్సి ఉందని చెప్పారు. అయితే, ఇతర పార్టీ నేతలతో బీజేపీ నేతలు కుమ్మక్కు కావడంతోనే అది జరగలేదని, ఆ సంగతి అందరికీ తెలుసు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అక్రమాస్తుల పంపకాల విషయంలో వచ్చిన కుటుంబ కలహాలను తన తండ్రి, సోదరుడు, బావతో చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు.
This post was last modified on May 29, 2025 4:08 pm
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…