ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే సాధారణంగా పని రాక్షసుడు అనే పేరుంది. రోజుకు 18 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అంటారు. కనిపించే ఫలితాన్ని బట్టి చూసినా అది నిజమేనని తేలుతుంది. ఇక, తాజాగా కడపలో మహానాడు జరుగుతోంది. దీనిని సక్సెస్ చేసేందుకు ఎంతో మంది నాయకులు ఉన్నా 19కి పైగా కమిటీలు ఉన్నా.. చంద్రబాబే అన్నింటినీ జాగ్రత్తగా చూసుకున్నారన్నది తెలిసిందే.
సో.. ఈ వయసు(75)లో ఆయన ఇంత బిజీగా ఉండడం అన్నీ తానే అయి నిర్వహించడం ఒక స్టోరీ అయితే.. మహానాడు ముగియకుండానే వచ్చే మూడు రోజుల పాటు ఆయన ఎంత బిజీగా ఉన్నారో.. తెలిస్తే.. అందరూ నివ్వెర పోతారు. అంత బిజీ అయిపోయారు చంద్రబాబు. గురువారం సాయంత్రం మహానాడు లో భారీ బహిరంగ సభ ఉంది. దీనికి ఐదు లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు హాజరు అవుతారని అంచనా వేశారు. మొబిలైజేషన్ కూడా అలానే ఉంది.
అయితే.. ఈ సమావేశాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. సుదీర్ఘ ప్రసంగం కూడా చేయనున్నారు. గత మూడు రోజుల నుంచి కూడా మహానాడులో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇప్పుడు మూడో రోజు సాయంత్రం సభ ముగిసీ ముగియగానే.. ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేయనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు(శుక్రవారం) ఢిల్లీలో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు, రాయితీలపై చర్చించనున్నారు.
ఇక, శనివారం ఉదయం నేరుగా.. ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రికి వస్తారు. కోనసీమ జిల్లా ముమ్మిడి వరం మండలం సీహెచ్ గునేపల్లికి చేరుకుని సామాజిక భద్రతా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొం టారు. అనంతరం.. అక్కడే సభ నిర్వహించనున్నారు. లబ్ధిదారులతో ముఖాముఖి చర్చించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం.. పార్టీ నాయకులతో భేటీ కానున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. గత రెండు రోజులుగా మహానాడుతో బిజీగా ఉన్న చంద్రబాబు.. ఇది అయ్యీ అవ్వకముందే.. వచ్చే మూడు రోజుల పాటు తీరిక లేకుండా గడుపుతుండడం గమనార్హం.
This post was last modified on May 29, 2025 3:55 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…