Political News

క్ష‌ణం తీరిక లేదు.. బాబు షెడ్యూల్ చూస్తే.. నివ్వెర‌పోతారు!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటేనే సాధార‌ణంగా ప‌ని రాక్ష‌సుడు అనే పేరుంది. రోజుకు 18 గంట‌ల పాటు ఆయ‌న ప‌నిచేస్తుంటార‌ని అంటారు. క‌నిపించే ఫ‌లితాన్ని బ‌ట్టి చూసినా అది నిజమేన‌ని తేలుతుంది. ఇక‌, తాజాగా క‌డ‌ప‌లో మ‌హానాడు జ‌రుగుతోంది. దీనిని స‌క్సెస్ చేసేందుకు ఎంతో మంది నాయ‌కులు ఉన్నా 19కి పైగా క‌మిటీలు ఉన్నా.. చంద్ర‌బాబే అన్నింటినీ జాగ్ర‌త్త‌గా చూసుకున్నార‌న్నది తెలిసిందే.

సో.. ఈ వ‌య‌సు(75)లో ఆయ‌న ఇంత బిజీగా ఉండ‌డం అన్నీ తానే అయి నిర్వ‌హించ‌డం ఒక స్టోరీ అయితే.. మ‌హానాడు ముగియ‌కుండానే వ‌చ్చే మూడు రోజుల పాటు ఆయ‌న ఎంత బిజీగా ఉన్నారో.. తెలిస్తే.. అంద‌రూ నివ్వెర పోతారు. అంత బిజీ అయిపోయారు చంద్ర‌బాబు. గురువారం సాయంత్రం  మ‌హానాడు లో భారీ బ‌హిరంగ స‌భ ఉంది. దీనికి ఐదు ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు హాజ‌రు అవుతార‌ని అంచ‌నా వేశారు. మొబిలైజేష‌న్ కూడా అలానే ఉంది.

అయితే.. ఈ స‌మావేశాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు.  సుదీర్ఘ ప్ర‌సంగం కూడా చేయనున్నారు. గ‌త మూడు రోజుల నుంచి కూడా మ‌హానాడులో తీరిక లేకుండా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మూడో రోజు సాయంత్రం స‌భ ముగిసీ ముగియ‌గానే.. ఢిల్లీ ఫ్ల‌యిట్ ఎక్కేయ‌నున్నారు. చంద్ర‌బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు(శుక్ర‌వారం) ఢిల్లీలో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు, రాయితీల‌పై చ‌ర్చించ‌నున్నారు.

ఇక‌, శ‌నివారం ఉద‌యం నేరుగా.. ఆయ‌న ఢిల్లీ నుంచి రాజ‌మండ్రికి వ‌స్తారు.  కోనసీమ జిల్లా ముమ్మిడి వరం మండలం సీహెచ్ గునేపల్లికి చేరుకుని సామాజిక భ‌ద్రతా పింఛ‌న్ పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొం టారు. అనంత‌రం.. అక్క‌డే స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ల‌బ్ధిదారులతో ముఖాముఖి చ‌ర్చించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం.. పార్టీ నాయ‌కుల‌తో భేటీ కానున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. గ‌త రెండు రోజులుగా మ‌హానాడుతో బిజీగా ఉన్న చంద్ర‌బాబు.. ఇది అయ్యీ అవ్వ‌క‌ముందే.. వ‌చ్చే మూడు రోజుల పాటు తీరిక లేకుండా గ‌డుపుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 29, 2025 3:55 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

59 minutes ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

1 hour ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

2 hours ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

4 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

4 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

4 hours ago