Political News

క్ష‌ణం తీరిక లేదు.. బాబు షెడ్యూల్ చూస్తే.. నివ్వెర‌పోతారు!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటేనే సాధార‌ణంగా ప‌ని రాక్ష‌సుడు అనే పేరుంది. రోజుకు 18 గంట‌ల పాటు ఆయ‌న ప‌నిచేస్తుంటార‌ని అంటారు. క‌నిపించే ఫ‌లితాన్ని బ‌ట్టి చూసినా అది నిజమేన‌ని తేలుతుంది. ఇక‌, తాజాగా క‌డ‌ప‌లో మ‌హానాడు జ‌రుగుతోంది. దీనిని స‌క్సెస్ చేసేందుకు ఎంతో మంది నాయ‌కులు ఉన్నా 19కి పైగా క‌మిటీలు ఉన్నా.. చంద్ర‌బాబే అన్నింటినీ జాగ్ర‌త్త‌గా చూసుకున్నార‌న్నది తెలిసిందే.

సో.. ఈ వ‌య‌సు(75)లో ఆయ‌న ఇంత బిజీగా ఉండ‌డం అన్నీ తానే అయి నిర్వ‌హించ‌డం ఒక స్టోరీ అయితే.. మ‌హానాడు ముగియ‌కుండానే వ‌చ్చే మూడు రోజుల పాటు ఆయ‌న ఎంత బిజీగా ఉన్నారో.. తెలిస్తే.. అంద‌రూ నివ్వెర పోతారు. అంత బిజీ అయిపోయారు చంద్ర‌బాబు. గురువారం సాయంత్రం  మ‌హానాడు లో భారీ బ‌హిరంగ స‌భ ఉంది. దీనికి ఐదు ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు హాజ‌రు అవుతార‌ని అంచ‌నా వేశారు. మొబిలైజేష‌న్ కూడా అలానే ఉంది.

అయితే.. ఈ స‌మావేశాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు.  సుదీర్ఘ ప్ర‌సంగం కూడా చేయనున్నారు. గ‌త మూడు రోజుల నుంచి కూడా మ‌హానాడులో తీరిక లేకుండా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మూడో రోజు సాయంత్రం స‌భ ముగిసీ ముగియ‌గానే.. ఢిల్లీ ఫ్ల‌యిట్ ఎక్కేయ‌నున్నారు. చంద్ర‌బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు(శుక్ర‌వారం) ఢిల్లీలో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు, రాయితీల‌పై చ‌ర్చించ‌నున్నారు.

ఇక‌, శ‌నివారం ఉద‌యం నేరుగా.. ఆయ‌న ఢిల్లీ నుంచి రాజ‌మండ్రికి వ‌స్తారు.  కోనసీమ జిల్లా ముమ్మిడి వరం మండలం సీహెచ్ గునేపల్లికి చేరుకుని సామాజిక భ‌ద్రతా పింఛ‌న్ పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొం టారు. అనంత‌రం.. అక్క‌డే స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ల‌బ్ధిదారులతో ముఖాముఖి చ‌ర్చించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం.. పార్టీ నాయ‌కుల‌తో భేటీ కానున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. గ‌త రెండు రోజులుగా మ‌హానాడుతో బిజీగా ఉన్న చంద్ర‌బాబు.. ఇది అయ్యీ అవ్వ‌క‌ముందే.. వ‌చ్చే మూడు రోజుల పాటు తీరిక లేకుండా గ‌డుపుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 29, 2025 3:55 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago