ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నివాళులర్పించారు. ఎన్టీఆర్ పేదల దేవుడిగా కీర్తి గడించారని చెప్పారు. అభిమాన ధనుడిగా.. తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడంలోను.. పేదలను ఆదుకోవడంలోనూ.. ఎన్టీఆర్ ఆదర్శ నాయకుడని ప్రధాని పేర్క న్నారు. ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానన్నారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన ఆమహనీయుడు తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు.
సినీ రంగంలోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ప్రధాని పేర్కొన్నారు. ఆ మహనీయుడి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. కాగా.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం నివాళులర్పించారు. ఇటీవల రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించేందుకు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ.. ఎన్టీఆర్ను స్మరించుకున్న విషయం తెలిసిందే.
This post was last modified on May 28, 2025 11:29 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…