ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నివాళులర్పించారు. ఎన్టీఆర్ పేదల దేవుడిగా కీర్తి గడించారని చెప్పారు. అభిమాన ధనుడిగా.. తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడంలోను.. పేదలను ఆదుకోవడంలోనూ.. ఎన్టీఆర్ ఆదర్శ నాయకుడని ప్రధాని పేర్క న్నారు. ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానన్నారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన ఆమహనీయుడు తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు.
సినీ రంగంలోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ప్రధాని పేర్కొన్నారు. ఆ మహనీయుడి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. కాగా.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం నివాళులర్పించారు. ఇటీవల రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించేందుకు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ.. ఎన్టీఆర్ను స్మరించుకున్న విషయం తెలిసిందే.
This post was last modified on May 28, 2025 11:29 am
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…