ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నివాళులర్పించారు. ఎన్టీఆర్ పేదల దేవుడిగా కీర్తి గడించారని చెప్పారు. అభిమాన ధనుడిగా.. తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడంలోను.. పేదలను ఆదుకోవడంలోనూ.. ఎన్టీఆర్ ఆదర్శ నాయకుడని ప్రధాని పేర్క న్నారు. ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానన్నారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన ఆమహనీయుడు తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు.
సినీ రంగంలోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ప్రధాని పేర్కొన్నారు. ఆ మహనీయుడి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. కాగా.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం నివాళులర్పించారు. ఇటీవల రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించేందుకు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ.. ఎన్టీఆర్ను స్మరించుకున్న విషయం తెలిసిందే.
This post was last modified on May 28, 2025 11:29 am
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…