Political News

అర్థమైందా రాజా?..జగన్ పై లోకేశ్ సెటైర్లు

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలానుగుణంగా పార్టీలో మార్పులు రావాల్సిన అవసరముందని లోకేశ్ అన్నారు. రాబోయే 40 ఏళ్లు పార్టీని విజయవంతంగా నడిపించేందుకు అవసరమైన అంశాలపై చర్చకు మహానాడు వేదిక కావాలని అన్నారు. పార్టీ జెండా ఎత్తినప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు లోకేశ్.

కార్యకర్తలే టీడీపీ అధినేతలని లోకేశ్ అన్నారు. అంజిరెడ్డి తాతా, మంజుల అక్క, తోట చంద్రయ్య అన్న తనకు స్ఫూర్తి అని చెప్పారు. పుంగనూరులో నామినేషన్ వేస్తాను..ఎవడు అడ్డొస్తాడో రండి అంటూ వైసీపీ నేతలపై తొడగొట్టిన అంజిరెడ్డి తాత తనకు స్ఫూర్తినిచ్చారని లోకేశ్ అన్నారు. ఇక, పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోందని తెలిసి అడ్డుకున్న మంజుల అక్కపై దాడి చేశారని, రక్తం కారుతున్నా సరే చివరి ఓట్ పోలయ్యే వరకు బూత్ లో నుంచి కదలని మంజుల అక్క తనకు ఆదర్శమని చెప్పారు.

అన్న తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఏకంగా కత్తి మెడపై పెట్టి ప్రత్యర్థి పార్టీ అధినేతకు జై కొట్టమని బెదిరించారని, అలా చేస్తే ప్రాణాలతో వదిలేస్తామని అన్నారని గుర్తు చేసుకున్నారు. కానీ, మెడపై కత్తి పెట్టినా..ప్రాణాలు పోతాయని తెలిసినా…జై టీడీపీ…జై చంద్రన్న అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్యను తాను ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. అందుకే, తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని, సొంత తల్లి, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని లోకేశ్ అన్నారు. అలా చేయడం వల్లే ఓటమి పాలయ్యారని అర్థమైందా రాజా…అంటూ జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. నాయకుల చుట్టూ కాదు….ప్రజల చుట్టూ తిరగాలని..అలా చేసిన వారిని పార్టీయే వెతుక్కుంటూ వచ్చి గుర్తింపునిస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి మంది సభ్యులు ఒక టీడీపీకే సొంతం అని అన్నారు.

తెలుగు వారి కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి, అన్నదాతకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు.

This post was last modified on May 27, 2025 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

19 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

42 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

52 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago