Political News

అర్థమైందా రాజా?..జగన్ పై లోకేశ్ సెటైర్లు

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలానుగుణంగా పార్టీలో మార్పులు రావాల్సిన అవసరముందని లోకేశ్ అన్నారు. రాబోయే 40 ఏళ్లు పార్టీని విజయవంతంగా నడిపించేందుకు అవసరమైన అంశాలపై చర్చకు మహానాడు వేదిక కావాలని అన్నారు. పార్టీ జెండా ఎత్తినప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు లోకేశ్.

కార్యకర్తలే టీడీపీ అధినేతలని లోకేశ్ అన్నారు. అంజిరెడ్డి తాతా, మంజుల అక్క, తోట చంద్రయ్య అన్న తనకు స్ఫూర్తి అని చెప్పారు. పుంగనూరులో నామినేషన్ వేస్తాను..ఎవడు అడ్డొస్తాడో రండి అంటూ వైసీపీ నేతలపై తొడగొట్టిన అంజిరెడ్డి తాత తనకు స్ఫూర్తినిచ్చారని లోకేశ్ అన్నారు. ఇక, పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోందని తెలిసి అడ్డుకున్న మంజుల అక్కపై దాడి చేశారని, రక్తం కారుతున్నా సరే చివరి ఓట్ పోలయ్యే వరకు బూత్ లో నుంచి కదలని మంజుల అక్క తనకు ఆదర్శమని చెప్పారు.

అన్న తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఏకంగా కత్తి మెడపై పెట్టి ప్రత్యర్థి పార్టీ అధినేతకు జై కొట్టమని బెదిరించారని, అలా చేస్తే ప్రాణాలతో వదిలేస్తామని అన్నారని గుర్తు చేసుకున్నారు. కానీ, మెడపై కత్తి పెట్టినా..ప్రాణాలు పోతాయని తెలిసినా…జై టీడీపీ…జై చంద్రన్న అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్యను తాను ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. అందుకే, తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని, సొంత తల్లి, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని లోకేశ్ అన్నారు. అలా చేయడం వల్లే ఓటమి పాలయ్యారని అర్థమైందా రాజా…అంటూ జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. నాయకుల చుట్టూ కాదు….ప్రజల చుట్టూ తిరగాలని..అలా చేసిన వారిని పార్టీయే వెతుక్కుంటూ వచ్చి గుర్తింపునిస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి మంది సభ్యులు ఒక టీడీపీకే సొంతం అని అన్నారు.

తెలుగు వారి కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి, అన్నదాతకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు.

This post was last modified on May 27, 2025 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

4 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

7 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

7 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

8 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

8 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

10 hours ago