బీఆర్ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత.. తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి సూచనలు చేస్తూ.. రాసిన లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని పై రాజకీయ వర్గాల్లోనూ.. మీడియా లోనూ అనేక రూపాల్లో చర్చసాగింది. ఇక, పార్టీ అధినేత కేసీఆర్ అయితే.. అసలు ఈ లేఖపై ఎవరూ స్పందించొద్దు! అని తేల్చి చెప్పినట్టు కూడా సమాచారం. దీంతో అప్పటి నుంచి ఈ లేఖ వ్యవహారంపై ఎవరూ స్పందించడం లేదు.
కాగా.. కవిత లేఖ బయటకు వచ్చి(రాసి చాలా రోజులే అయిందని సమాచారం).. మూడు రోజులు అయినా.. కూడా ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు.. పిలుపులు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో మరింత చర్చసాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయంలో కవిత నివాసానికి తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత.. దీవకొండ దామోదర్రావు వచ్చారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది కూడా ఉండడం గమనార్హం.
దీనిని బట్టి.. కేసీఆరే దామోదర్రావును, న్యాయవాదిని కవిత వద్దకుపంపించారా? అనేది హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న దామోదర్రావు.. పార్టీ పరంగానే కాకుండా.. పత్రిక నమస్తే తెలంగాణ పరంగా కూడా చేరువ. పత్రికను స్థాపించింది కూడా ఆయన కనుసన్నల్లోనే. ఇక, ఆ తర్వాత కేసీఆర్ ఆశీస్సులతోనే 2022లో రాజ్యసభలో అడుగు పెట్టారు. దీంతోనే ఆయనను `కేసీఆర్ ఆత్మగా’ సొంత మీడియాలో పిలుస్తారు.
సో.. కేసీఆర్కు సన్నిహితుడుగా.. ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న దామోదర్రావు ఇప్పుడు కవితను కలుసుకునేందుకు రావడం.. ఆశ్చర్యంగాను.. ఆసక్తిగాను మారింది. ఈయన వెంట న్యాయవాది కూడా ఉండడంతో ఏదో తేల్చుకునే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరకు రాజీ ధోరణికి వస్తారా? లేక.. ఏం జరుగుతుందన్నది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.
This post was last modified on May 26, 2025 11:25 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…