బీఆర్ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత.. తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి సూచనలు చేస్తూ.. రాసిన లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని పై రాజకీయ వర్గాల్లోనూ.. మీడియా లోనూ అనేక రూపాల్లో చర్చసాగింది. ఇక, పార్టీ అధినేత కేసీఆర్ అయితే.. అసలు ఈ లేఖపై ఎవరూ స్పందించొద్దు! అని తేల్చి చెప్పినట్టు కూడా సమాచారం. దీంతో అప్పటి నుంచి ఈ లేఖ వ్యవహారంపై ఎవరూ స్పందించడం లేదు.
కాగా.. కవిత లేఖ బయటకు వచ్చి(రాసి చాలా రోజులే అయిందని సమాచారం).. మూడు రోజులు అయినా.. కూడా ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు.. పిలుపులు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో మరింత చర్చసాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయంలో కవిత నివాసానికి తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత.. దీవకొండ దామోదర్రావు వచ్చారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది కూడా ఉండడం గమనార్హం.
దీనిని బట్టి.. కేసీఆరే దామోదర్రావును, న్యాయవాదిని కవిత వద్దకుపంపించారా? అనేది హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న దామోదర్రావు.. పార్టీ పరంగానే కాకుండా.. పత్రిక నమస్తే తెలంగాణ పరంగా కూడా చేరువ. పత్రికను స్థాపించింది కూడా ఆయన కనుసన్నల్లోనే. ఇక, ఆ తర్వాత కేసీఆర్ ఆశీస్సులతోనే 2022లో రాజ్యసభలో అడుగు పెట్టారు. దీంతోనే ఆయనను `కేసీఆర్ ఆత్మగా’ సొంత మీడియాలో పిలుస్తారు.
సో.. కేసీఆర్కు సన్నిహితుడుగా.. ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న దామోదర్రావు ఇప్పుడు కవితను కలుసుకునేందుకు రావడం.. ఆశ్చర్యంగాను.. ఆసక్తిగాను మారింది. ఈయన వెంట న్యాయవాది కూడా ఉండడంతో ఏదో తేల్చుకునే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరకు రాజీ ధోరణికి వస్తారా? లేక.. ఏం జరుగుతుందన్నది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.
This post was last modified on May 26, 2025 11:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…