Political News

కేసీఆర్ ఆత్మ‌తో క‌విత‌ భేటీ… రాయ‌బారమేనా?

బీఆర్ఎస్ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత పార్టీ అధినేత‌.. త‌న తండ్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సూచ‌న‌లు చేస్తూ.. రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీని పై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మీడియా లోనూ అనేక రూపాల్లో చ‌ర్చ‌సాగింది. ఇక‌, పార్టీ అధినేత కేసీఆర్ అయితే.. అస‌లు ఈ లేఖ‌పై ఎవ‌రూ స్పందించొద్దు! అని తేల్చి చెప్పిన‌ట్టు కూడా స‌మాచారం. దీంతో అప్ప‌టి నుంచి ఈ లేఖ వ్య‌వ‌హారంపై ఎవ‌రూ స్పందించ‌డం లేదు.

కాగా.. క‌విత లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చి(రాసి చాలా రోజులే అయింద‌ని స‌మాచారం).. మూడు రోజులు అయినా.. కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సంప్ర‌దింపులు.. పిలుపులు లేక‌పోవ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రింత చ‌ర్చ‌సాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా సోమ‌వారం సాయంత్రం 6-7 గంట‌ల స‌మ‌యంలో క‌విత నివాసానికి తెలంగాణ తొలిద‌శ ఉద్య‌మ కారుడు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ‌ స‌భ్యుడు, బీఆర్ఎస్ నేత‌.. దీవ‌కొండ దామోద‌ర్‌రావు వ‌చ్చారు. ఆయ‌న వెంట సీనియ‌ర్ న్యాయ‌వాది కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. కేసీఆరే దామోద‌ర్‌రావును, న్యాయ‌వాదిని క‌విత వ‌ద్ద‌కుపంపించారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న దామోద‌ర్‌రావు.. పార్టీ ప‌రంగానే కాకుండా.. ప‌త్రిక న‌మస్తే తెలంగాణ ప‌రంగా కూడా చేరువ‌. ప‌త్రిక‌ను స్థాపించింది కూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే. ఇక‌, ఆ త‌ర్వాత కేసీఆర్ ఆశీస్సుల‌తోనే 2022లో రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టారు. దీంతోనే ఆయ‌న‌ను `కేసీఆర్ ఆత్మ‌గా’ సొంత మీడియాలో పిలుస్తారు.

సో.. కేసీఆర్‌కు స‌న్నిహితుడుగా.. ఆయ‌న‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్న దామోద‌ర్‌రావు ఇప్పుడు క‌విత‌ను క‌లుసుకునేందుకు రావ‌డం.. ఆశ్చ‌ర్యంగాను.. ఆస‌క్తిగాను మారింది. ఈయ‌న వెంట న్యాయ‌వాది కూడా ఉండ‌డంతో ఏదో తేల్చుకునే ప‌నిలోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి చివ‌ర‌కు రాజీ ధోర‌ణికి వ‌స్తారా? లేక‌.. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది మాత్రం ఇంకా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మారింది.

Satya

Recent Posts

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

51 minutes ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

3 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

3 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

4 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

5 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

5 hours ago