బీఆర్ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత.. తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి సూచనలు చేస్తూ.. రాసిన లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని పై రాజకీయ వర్గాల్లోనూ.. మీడియా లోనూ అనేక రూపాల్లో చర్చసాగింది. ఇక, పార్టీ అధినేత కేసీఆర్ అయితే.. అసలు ఈ లేఖపై ఎవరూ స్పందించొద్దు! అని తేల్చి చెప్పినట్టు కూడా సమాచారం. దీంతో అప్పటి నుంచి ఈ లేఖ వ్యవహారంపై ఎవరూ స్పందించడం లేదు.
కాగా.. కవిత లేఖ బయటకు వచ్చి(రాసి చాలా రోజులే అయిందని సమాచారం).. మూడు రోజులు అయినా.. కూడా ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు.. పిలుపులు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో మరింత చర్చసాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయంలో కవిత నివాసానికి తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత.. దీవకొండ దామోదర్రావు వచ్చారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది కూడా ఉండడం గమనార్హం.
దీనిని బట్టి.. కేసీఆరే దామోదర్రావును, న్యాయవాదిని కవిత వద్దకుపంపించారా? అనేది హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న దామోదర్రావు.. పార్టీ పరంగానే కాకుండా.. పత్రిక నమస్తే తెలంగాణ పరంగా కూడా చేరువ. పత్రికను స్థాపించింది కూడా ఆయన కనుసన్నల్లోనే. ఇక, ఆ తర్వాత కేసీఆర్ ఆశీస్సులతోనే 2022లో రాజ్యసభలో అడుగు పెట్టారు. దీంతోనే ఆయనను `కేసీఆర్ ఆత్మగా’ సొంత మీడియాలో పిలుస్తారు.
సో.. కేసీఆర్కు సన్నిహితుడుగా.. ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న దామోదర్రావు ఇప్పుడు కవితను కలుసుకునేందుకు రావడం.. ఆశ్చర్యంగాను.. ఆసక్తిగాను మారింది. ఈయన వెంట న్యాయవాది కూడా ఉండడంతో ఏదో తేల్చుకునే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరకు రాజీ ధోరణికి వస్తారా? లేక.. ఏం జరుగుతుందన్నది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.
This post was last modified on May 26, 2025 11:25 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…