వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో ఆ పార్టీలో తీవ్ర అలజడి నెలకొంది. ఇప్పటికే చాలా మంది నాయకులు అరెస్టు కావడం.. మరోవైపు కేసులు తరుముతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో పార్టీలో తీవ్ర ఆవేదన.. ఆందోళన నెలకొంది. జగన్ తక్షణమే బయటకు రావాలన్న నినాదాలు కూడా ఊపందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాకాని అరెస్టు తర్వాత.. జగన్పై ఒత్తిడి మరింత పెరిగింది.
ఇదిలావుంటే..ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుందా? ఇకనైనా ఆగుతుందా? అనే విషయంపై విజయవాడ పోలీసులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇంకా అయిపోలేదు” అంటూ.. ముఖ్య అధికారి ఒకరు మీడియా ముందు వ్యాఖ్యానించారు. కాకాణి అరెస్టుపై వివరాలు కోరుతూ.. విజయవాడ సీనియర్ అధికారిని మీడియ ప్రశ్నించినప్పుడు.. ఆయన చెప్పిన సమాధానం ఇదే. దీనిని బట్టి వైసీపీ నేతల అరెస్టులు మరిన్ని కొనసాగుతాయన్న సంకేతాలు వచ్చాయి.
అయితే.. వీరిలో ఎవరెవరు ఉన్నారన్న విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాలను గమనిస్తే.. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనపై చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు అనేక ఫిర్యాదులు చేశారు. గనులు, అటవీ భూముల ఆక్రమణలు, మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో పత్రాల దహనం.. సహా ఎన్నికల సమయంలో తమ్ముళ్ల బెదిరింపులు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలోని అంగళ్లలో జరిగిన వివాదం.. రాళ్ల దాడి.. ఇలా అనేక కేసులు పేరుకు పోయాయి.
అయితే.. ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా తూర్పుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే క్రమంలో ధియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన నలుగురిలో ఆయన పేరు ఉందని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో బియ్యం ఎగుమతుల కేసు కూడా ఉంది. ఇలా.. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…