Political News

వైసీపీ నేత పిన్నెల్లి సోద‌రుల‌పై మ‌ర్డ‌ర్‌ కేసు… ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డిల‌పై పోలీసులు హ‌త్య కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 302(మ‌ర్డ‌ర్ కేసు) కింద వీరిపై కేసు న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప‌ల్నాడులో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణ హ‌త్య జ‌రిగింది. టీడీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన ఆధిప‌త్య పోరు.. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు టీడీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు.

ప‌ల్నాడు ప్రాంతంలోని మాచ‌ర్ల‌కు చెందిన వెంక‌టేశ్వ‌ర్లు, కోటేశ్వ‌ర‌రావులు అన్న‌ద‌మ్ములు. వీరు సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్నారు. ప్ర‌స్తుతం క్షేత్ర‌స్థాయి రాజ‌కీయాల‌ను వెంక‌టేశ్వ‌ర్లు చ‌క్క బెడుతున్నాడు. ఆయ‌న‌కు కోటేశ్వ‌ర‌రావు స‌హ‌క‌రిస్తున్నాడు. అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు శ్రీను, వెంక‌ట్రావు లు.. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చారు. వారు ఇద్ద‌రూ కూడా.. పిన్నెల్లికి మద్ద‌తు దారులుగా ఉన్నార‌ని పోలీసులు చెబుతున్నారు.

అయితే.. క్షేత్రస్థాయిలో టీడీపీ రాజ‌కీయాల‌ను తామే నిర్వ‌హిస్తామంటూ.. శ్రీను, వెంక‌ట్రావులు గ‌త కొన్నాళ్లుగా యాగీ చేస్తున్నారు. కానీ, పార్టీ నుంచి వెంక‌టేశ్వ‌ర‌రావుకు మ‌ద్ద‌తు ఉంది. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌నే చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని శ్రీను, వెంక‌ట్రావులు జీర్ణించుకోలేక పోతున్నారు. పైగా.. త‌మ‌పై పెత్త‌నం చేస్తున్నార‌ని వెంక‌టేశ్వర్లు, కోటేశ్వ‌ర‌రావుపై అక్క‌సు పెంచుకున్నారు. శ‌నివారం ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు తెలంగాణ‌లో కార్య‌క్ర‌మానికి వెళ్లి.. తిరిగి గ్రామానికి చేరుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో కాపు కాచి స్కార్పియో కారుతో వీరిద్ద‌రినీ గుద్ది చంపేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో వారితో పాటు.. వారిని ప్రోత్స‌హించి.. హ‌త్య‌కు పురికొల్పారంటూ.. పిన్నెల్లి సోద‌రుల‌పై కేసులు న‌మోదు చేశారు. కాగా, ఇప్ప‌టికే పిన్నెల్లిపై ఎన్నిక‌ల స‌మ‌యంలో పోలింగ్ బూత్‌లోకి ప్ర‌వేశించి ఈవీఎంల‌ను ధ్వంసం చేయ‌డం.. ఓట‌ర్ల‌పై దూష‌ణ‌ల‌కు దిగిన కేసు న‌డుస్తోంది. ఇప్పుడు ఏకంగా హ‌త్య కేసు న‌మోదైంది. వీరిని ఏ-6, ఏ-7లుగా పోలీసులు పేర్కొన్నారు.

This post was last modified on May 25, 2025 6:03 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

5 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

8 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

9 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

9 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

9 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

10 hours ago