బీఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన సంచలన లేఖ.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఇక, బీఆర్ ఎస్పై తీవ్ర చర్చకు కూడా దారితీసింది. దీనిపై కవిత శుక్రవారం రాత్రే స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేనన్నారు. అయితే.. కొందరు కోవర్టుల కారణంగానే అది బయటకు వచ్చి ఉంటుందన్న ఆమె.. కేసీఆర్ను దేవుడితో పోల్చారు. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ వ్యవహారంపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. లేఖ రాయడం తప్పు కాదన్న ఆయన.. అంతర్గత విషయాలను రోడ్డు పడేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా ఎప్పుడైనా లేఖలు రాసే అవకాశం ఉందన్నారు. దీనిని తాము తప్పుబట్టడం లేదని.. కానీ, కొన్ని అంతర్గత విషయాలపై అంతర్గతంగానే చర్చిస్తే బెటర్ అన్నది పార్టీ నియమావళి అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక, కోవర్టుల విషయంపై మాట్లాడుతూ.. అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు వారే బయటకు వస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అయితే..కవిత రాసిన లేఖను తాను రాజకీయ కోణం కన్నా.. సూచనలు సలహాల కోణంలోనే చూస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయడం ఎవరికీ భావ్యం కాదన్న ఆయన.. ఏదైనా ఉంటే కేసీఆర్ దగ్గర ఫ్రీగా చెప్పుకోవచ్చని సూచించారు. ఇక, పార్టీలైన్ కవిత దాటారా? అన్న మీడియా ప్రశ్నలకు ఆయన దాట వేశారు. ఆ విషయం పార్టీ అధినేత చూసుకుంటారని వ్యాఖ్యానించారు.
This post was last modified on May 24, 2025 2:18 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…