Political News

క‌విత.. మ‌రో ష‌ర్మిల‌గా మారుతున్నారా!

బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత.. వ్య‌వ‌హారం పై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌ సాగుతోంది. ఆమె గ‌త కొన్నాళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ప్ర‌స్తుతం త‌న తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ వంటివి.. రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుది పేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన కుటుంబ స‌భ్యులు లేరంటే లేరు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఇష్ట‌మైనా … అయిష్ట‌మైనా వాటిని కొన‌సాగించారు. వాటిని పాటించారు. దేశ‌వ్యాప్తంగా పొత్తులు పెట్టుకునేందుకు వెళ్లిన‌ప్పుడు పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశంలో కేసీఆర్‌ను ఆయ‌న త‌న‌యుడు, అప్ప‌టి మంత్రి కేటీఆర్‌ విభేదించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించారు. ఆ త‌ర్వాత‌.. కూడా కుటుంబంలో వివాదాలు విభేదాలు కామ‌న్‌గానే వెలుగు చూసినా.. ర‌చ్చ‌కు దారితీయ‌కుండా కుటుంబం జాగ్ర‌త్త ప‌డింది. కానీ, తాజాగా క‌విత నేరుగా త‌న తండ్రి ని ప్ర‌శ్నించ‌డం.. “మ‌నం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామ‌న్న సంకేతాలు పంపించ‌డం స‌రిగాదేమో!”, “కాంగ్రెస్ కంటే వెనుక బ‌డుతున్నాం.. “. “ఉద్య‌మ నాయ‌కుల‌కు గౌర‌వం త‌గ్గుతోంది.” “ప్లీన‌రీ స‌రిగా లేదు” అని వ్యాఖ్యానించ‌డం చూస్తే.. క‌విత నేరుగా వివాదానికి దిగుతున్న‌ట్టే క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలుచెబుతున్నాయి.

తాజాగా అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నాయ‌కులు కూడా క‌విత వ్య‌వ‌హారంపై స్పందించారు. కాంగ్రెస్ వ‌దిలిన బాణ‌మేన‌ని బీజేపీ ఆరోపిస్తే.. బీజేపీ వ‌దిలిన బాణ‌మేన‌ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. తాజాగా బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా కూడా ఉన్న క‌విత‌.. త‌న నిబ‌ద్ధ‌త‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్ర‌ద‌ర్శించుకునే అవ‌కాశం.. త‌న తండ్రితో నేరుగా మాట్లాడే అవ‌కాశం ఉన్నా.. ఇప్పుడు బ‌హిరంగ వేదిక‌గా ఇలా లేఖ‌ సంధించ‌డం ద్వారా మ‌రో ‘ష‌ర్మిల‌’ కానున్నారా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ఆస్తులు, ప‌ద‌వుల విష‌యంలో అన్న‌తో విభేదించి.. తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టుకున్న విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. దానినిముగించి ఏపీలో కాంగ్రెస్ చీఫ్‌గా ఉంటున్నారు. అయితే.. ఇంత విభేదాలు నిజంగానే క‌విత – కేసీఆర్ మ‌ధ్య ఉన్నాయా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఆస్తుల వ్య‌వ‌హారం అయినా.. అప్పుల వ్య‌వ‌హారం అయినా.. గ‌తంలోనే తేలిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, రాజ‌కీయంగా గ‌తంలో ఎంపీసీటు ఇచ్చారు.తాజాగా ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. రేపు పార్టీ బాధ్య‌త‌ల‌ను కేటీఆర్‌కు అప్ప‌గించే ఆలోచ‌న ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతున్న ద‌రిమిలా.. క‌విత ఇలా యూట‌ర్న్ తీసుకున్నార‌న్నది రాజ‌కీయ వ‌ర్గాల అభిప్రాయం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 24, 2025 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago