2019-21 మధ్య రెండు మూడు దశలుగా విస్తరించి.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా ప్రస్తుతం మరోసారి ప్రపంచ దేశాలకు సవాల్ రువ్వుతోంది. ప్రస్తుతం ఐదారు దేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఇది బలమైన కరోనా వైరస్ రూపాంతరమా? లేక సాధారణంగా పోతుందా? అనే దానిపై పరిశోధనలు జరుగుతు న్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని ఓ కాలనీకి చెందిన వివాహతకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీనిని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. వారికి కూడా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న కుటుంబాన్ని పలు జాగ్రత్తలతో డిశ్చార్జ్ చేసి వారం రోజులు పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇక, కోవిడ్ 19 పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు.. కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమి గూడవద్దని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్ పోర్టులు, కోవిడ్- 19 నియమావళిని పాటించాలని స్పష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరింది. దగ్గినా లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలి సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సూచనలతో ఒక నోట్ విడుదల చేసింది.
మరోవైపు.. కరోనా కేసు నమోదైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని.. కేంద్ర ప్రభుత్వం సూచించే గైడ్ లైన్స్ను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. అవసరమైతే.. వైద్యుల సెలవులను రద్దు చేయాలని సూచించారు.
This post was last modified on May 23, 2025 7:12 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…