2019-21 మధ్య రెండు మూడు దశలుగా విస్తరించి.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా ప్రస్తుతం మరోసారి ప్రపంచ దేశాలకు సవాల్ రువ్వుతోంది. ప్రస్తుతం ఐదారు దేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఇది బలమైన కరోనా వైరస్ రూపాంతరమా? లేక సాధారణంగా పోతుందా? అనే దానిపై పరిశోధనలు జరుగుతు న్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని ఓ కాలనీకి చెందిన వివాహతకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీనిని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. వారికి కూడా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న కుటుంబాన్ని పలు జాగ్రత్తలతో డిశ్చార్జ్ చేసి వారం రోజులు పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇక, కోవిడ్ 19 పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు.. కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమి గూడవద్దని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్ పోర్టులు, కోవిడ్- 19 నియమావళిని పాటించాలని స్పష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరింది. దగ్గినా లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలి సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సూచనలతో ఒక నోట్ విడుదల చేసింది.
మరోవైపు.. కరోనా కేసు నమోదైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని.. కేంద్ర ప్రభుత్వం సూచించే గైడ్ లైన్స్ను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. అవసరమైతే.. వైద్యుల సెలవులను రద్దు చేయాలని సూచించారు.
This post was last modified on May 23, 2025 7:12 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…