Political News

ఏపీలో ఫ‌స్ట్ క‌రోనా కేసు.. సీఎం రియాక్షన్ ఇదే!

2019-21 మ‌ధ్య రెండు మూడు ద‌శ‌లుగా విస్త‌రించి.. ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను హ‌రించిన క‌రోనా ప్ర‌స్తుతం మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌కు స‌వాల్ రువ్వుతోంది. ప్ర‌స్తుతం ఐదారు దేశాల్లో క‌రోనా కేసులు పెరిగాయి. ఇది బ‌ల‌మైన క‌రోనా వైర‌స్ రూపాంత‌ర‌మా? లేక సాధార‌ణంగా పోతుందా? అనే దానిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతు న్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఏపీలో తొలి క‌రోనా పాజిటివ్‌ కేసు న‌మోదైంది. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని ఓ కాలనీకి చెందిన వివాహతకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీనిని ప్ర‌భుత్వం అధికారికంగానే ప్ర‌క‌టించింది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వ‌హించ‌గా.. వారికి కూడా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే విష‌యాన్ని ప్ర‌భుత్వం కూడా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆసుపత్రిలో ఉన్న కుటుంబాన్ని ప‌లు జాగ్ర‌త్త‌ల‌తో డిశ్చార్జ్ చేసి వారం రోజులు పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇక‌, కోవిడ్ 19 పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్ర‌భుత్వం ఆదేశించింది.

మ‌రోవైపు.. కరోనా వైరస్ పాజిటివ్ కేసు న‌మోదైన నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమి గూడవ‌ద్ద‌ని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్ పోర్టులు, కోవిడ్- 19 నియమావళిని పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని కోరింది. దగ్గినా లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలి సూచించింది. ఈ మేర‌కు వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక సూచ‌న‌ల‌తో ఒక నోట్ విడుద‌ల చేసింది.

మ‌రోవైపు.. క‌రోనా కేసు న‌మోదైన నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం సూచించే గైడ్ లైన్స్‌ను త‌ప్ప‌కుండా పాటించాల‌ని పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే.. వైద్యుల సెల‌వుల‌ను ర‌ద్దు చేయాల‌ని సూచించారు.

This post was last modified on May 23, 2025 7:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 minute ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago