వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే… అదేదో రాజకీయం అంటే… రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య వాదులాట, దానిని మించి కొట్లాట వరకే పరిమితం అన్నట్లుగా భావించక తప్పదు. అదికారంలో ఉంటే…సొంత పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిన జగన్… కనీసం మీడియాకు కూడా తన ముఖాన్ని చూపలేదు. అదే విపక్షంలో ఉంటే మాత్రం తన పార్టీ వారిని ప్రత్యర్థి పార్టీలు వేదిస్తున్నాయని, తాను అదికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటానని హెచ్చరికలు జారీ చేస్తూ సాగుతున్నారు.
ఇప్పుడే కాదు.. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి పాలు అయినప్పుడు జగన్ మీడియా ముందుకు వచ్చి… ఇప్పుడు వారు కొట్టారు.. తీసుకుంటాం.. రేపు మా వంతు వస్తుంది… తిరిగి అంతే బలంగా కొడతాం… అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంగళవారం విశాఖ జిల్లాలోని పలు స్థానిక సంస్తలకు చెందిన ప్రజా ప్రతినిదులతో జగన్ తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలోనూ ఆయన ఈ కొట్లాటల మాటలనే వల్లె వేయడం గమనార్హం. ప్రస్తుతం మనం విపక్షంలో ఉన్నామని గుర్తు చేసిన జగన్… అధికార పక్షం కొట్టినా కొట్టించుకునేందుకు సిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగగలం అని చెప్పారు.
”మిమ్మల్ని కొట్టిన వాళ్ల పేర్లన్నీ రాసిపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. మరోమారు మన ప్రభుత్వమే అధికారం చేపడుతుంది. అప్పుడు ఆ పేర్లన్నింటినీ బయటకు తీద్దాం. వారి భరతం పడదాం..అంటూ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. మనల్ని కొట్టినవాళ్లను మనం కూడా అదికారంలోకి వచ్చాక కొట్టి తీరదాం” అని జగన్ సూచించడం గమనార్హం. మొత్తంగా ప్రతీకార రాజకీయాలకు జగన్ ఆజ్యం పోస్తున్నారన్న వాదనలు కూడా ఈ తరహా వ్యాఖ్యలే కారణమని చెప్పక తప్పదు. జగన్ నోట నుంచి ఈ తరహా వ్యాఖ్యలే ఇదే తొలిసారి ఏమీ కాదు. ఇటీవలి జరుగుతున్న దాదాపుగా అన్ని పార్టీ సమావేశాల్లోనూ జగన్ ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు.
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…