Political News

కేబినెట్ లో ‘లిక్కర్’పై సుదీర్ఘ చర్చ.. ఏం జరుగుతోంది?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే లెక్కలేనన్ని సంచలనాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే… ఈ సంచలనాలను మించిన సంచలన ఘటనలు త్వరలోనే చెటుచేసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతి లో జరిగిన కేబినెట్ భేటీలో లిక్కర్ స్కాంపై సుధీర్ఘ చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా మంత్రులంతా పాలుపంచుకున్న ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా హాజరయ్యారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిర్దేశిత షెడ్యూల్ ముగిసిన తర్వాత కేబినెట్ లో లిక్కర్ స్కాం అంశాన్ని స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారు. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎవరెవరిని అరెస్టు చేశారు? ఏఏ ఆధారాలను సేకరించారు? ఎంతమేర అటు ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రజలకు గానీ నష్టం జరిగింది? ప్రస్తుతం ఈ కేసు పరిస్థితి ఏమిటి? మున్ముందు ఈ కేసులో తీసుకోబోయే చర్యలు ఎలా ఉండనున్నాయి? అన్న అంశాలపై డీజీపీ కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. అదే సమయంలో జంగారెడ్డిగూడెం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కూడా ఆయన కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం లిక్కర్ స్కాంపై మాట్లాడిన చంద్రబాబు… ఇకపై మద్యం కుంభకోణం గురించి మంత్రులెవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఈ కేసు నీరు గారకుండా… పక్కదారి పట్టకుండా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు స్వతంత్ర సంస్థలు కూడా దర్యాప్తు జరుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన మద్యం కుంభకోణంపై విచారణ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. దర్యాప్తు పారదర్శకతపై ఏ ఒక్కరికి కూడా అనుమానాలు ఉండని రీతిలో చర్యలు చేపడుతున్నామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని చంద్రబాబు… ఈ కేసులో తప్పు చేసిన వారు ఎవరైనా అరెస్టు అయి తీరాల్సిందేనని ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అరెస్టు కావడమే కాకుండా విచారణలో సదరు వ్యక్తులకు ఏమాత్రం ప్రమేయం ఉందని తేలినా… ఆ మేరకు వారిపై చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ద్వారా లిక్కర్ స్కాంలో ఇప్పటిదాకా జరిగిన అరెస్టుల కంటే కూడా మరిన్నికీలక అరెస్టులు, మరింత మంది కీలక వ్యక్తులు అరెస్టు కాక తప్పదన్న మాటను చంద్రబాబు పరోక్షంగా వినిపించినట్టు అయ్యింది. మొత్తంగా కేబినెట్ లో లిక్కర్ స్కాంపై చర్చ ద్వారా వైసీపీ ఒక్కసారిగా హైరానా మొదలైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on May 21, 2025 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

2 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

3 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

3 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

4 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

5 hours ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

6 hours ago