ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే లెక్కలేనన్ని సంచలనాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే… ఈ సంచలనాలను మించిన సంచలన ఘటనలు త్వరలోనే చెటుచేసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతి లో జరిగిన కేబినెట్ భేటీలో లిక్కర్ స్కాంపై సుధీర్ఘ చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా మంత్రులంతా పాలుపంచుకున్న ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా హాజరయ్యారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిర్దేశిత షెడ్యూల్ ముగిసిన తర్వాత కేబినెట్ లో లిక్కర్ స్కాం అంశాన్ని స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారు. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎవరెవరిని అరెస్టు చేశారు? ఏఏ ఆధారాలను సేకరించారు? ఎంతమేర అటు ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రజలకు గానీ నష్టం జరిగింది? ప్రస్తుతం ఈ కేసు పరిస్థితి ఏమిటి? మున్ముందు ఈ కేసులో తీసుకోబోయే చర్యలు ఎలా ఉండనున్నాయి? అన్న అంశాలపై డీజీపీ కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. అదే సమయంలో జంగారెడ్డిగూడెం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కూడా ఆయన కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం లిక్కర్ స్కాంపై మాట్లాడిన చంద్రబాబు… ఇకపై మద్యం కుంభకోణం గురించి మంత్రులెవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఈ కేసు నీరు గారకుండా… పక్కదారి పట్టకుండా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు స్వతంత్ర సంస్థలు కూడా దర్యాప్తు జరుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన మద్యం కుంభకోణంపై విచారణ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. దర్యాప్తు పారదర్శకతపై ఏ ఒక్కరికి కూడా అనుమానాలు ఉండని రీతిలో చర్యలు చేపడుతున్నామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని చంద్రబాబు… ఈ కేసులో తప్పు చేసిన వారు ఎవరైనా అరెస్టు అయి తీరాల్సిందేనని ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అరెస్టు కావడమే కాకుండా విచారణలో సదరు వ్యక్తులకు ఏమాత్రం ప్రమేయం ఉందని తేలినా… ఆ మేరకు వారిపై చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ద్వారా లిక్కర్ స్కాంలో ఇప్పటిదాకా జరిగిన అరెస్టుల కంటే కూడా మరిన్నికీలక అరెస్టులు, మరింత మంది కీలక వ్యక్తులు అరెస్టు కాక తప్పదన్న మాటను చంద్రబాబు పరోక్షంగా వినిపించినట్టు అయ్యింది. మొత్తంగా కేబినెట్ లో లిక్కర్ స్కాంపై చర్చ ద్వారా వైసీపీ ఒక్కసారిగా హైరానా మొదలైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…