ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు పలు జిల్లాల్లో ఆయన అనేక యాత్రలు, ఉద్య మాలు చేశారు. అదేవిధంగా ఆయన తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిం చారు. ఈ సమయంలో ప్రజలు వీరికి అనేక విన్నపాలు చేశారు. అనేక సమస్యలను కూడా వీరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో వారికి చంద్రబాబు, నారా లోకేష్ అనేక హామీలను ఇచ్చారు. అయితే.. వీటిని సూపర్ సిక్స్లో చేర్చలేదు. కానీ, ఆ హామీలపై తరచుగా ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల చంద్రబాబు స్వయంగా చేయించిన ఐవీఆర్ ఎస్ సర్వేలోనూ.. గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రజలు లేవనెత్తారు. ఆయా హామీలను నెరవేర్చాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రి వర్గం అనంతరం.. సుమా రు రాత్రి 10 గంటల వరకు సీఎం చంద్రబాబుకీలక మంత్రులతో నాటి ఎన్నికలకు ముందు మైఖికంగా ప్రజలకు ఇచ్చిన హామీల ను అమలు చేద్దామని ప్రతిపాదించారు. దీనికి సదరు మంత్రులు కూడా ఓకే చెప్పారు. తమకు కూడా అనుభవాలు ఎదురవు తున్నాయని.. ఎన్నికలకు ముందు తాము కూడా నియోజకవర్గాల్లో పర్యటించి.. పలుమౌఖిక హామీలు ఇచ్చామని.. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ మౌఖిక హామీల్లో కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాలతోపాటు.. ఆర్థికేత అంశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన సీఎం చంద్రబాబు.. వాటిని తక్షణమే అమలు చేస్తే.. ప్రజల్లో ప్రభుత్వంపై సంతృప్తి పెరుగుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ప్రభుత్వంపై భారం కాని మౌఖిక హామీలను ఈ నెలలోనే ప్రారంభించి అమలు చేయాలని సూచించారు. దీనికి ఒక నిర్ణయం తీసుకుని.. అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే.. రూ.10 లక్షలలోపు ఇచ్చిన మౌఖిక హామీలను కూడా నెరవేరిస్తే బాగుంటుందని మంత్రులు సూచించగా.. దానిపైనా ఒక నివేదిక తయారు చేయాలని చంద్రబాబు కోరారు. దీంతో ఈ నెల చివరి నుంచే ఆయా హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
ఇవీ.. మౌఖిక హామీలు..
This post was last modified on May 21, 2025 10:35 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…