ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు పలు జిల్లాల్లో ఆయన అనేక యాత్రలు, ఉద్య మాలు చేశారు. అదేవిధంగా ఆయన తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిం చారు. ఈ సమయంలో ప్రజలు వీరికి అనేక విన్నపాలు చేశారు. అనేక సమస్యలను కూడా వీరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో వారికి చంద్రబాబు, నారా లోకేష్ అనేక హామీలను ఇచ్చారు. అయితే.. వీటిని సూపర్ సిక్స్లో చేర్చలేదు. కానీ, ఆ హామీలపై తరచుగా ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల చంద్రబాబు స్వయంగా చేయించిన ఐవీఆర్ ఎస్ సర్వేలోనూ.. గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రజలు లేవనెత్తారు. ఆయా హామీలను నెరవేర్చాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రి వర్గం అనంతరం.. సుమా రు రాత్రి 10 గంటల వరకు సీఎం చంద్రబాబుకీలక మంత్రులతో నాటి ఎన్నికలకు ముందు మైఖికంగా ప్రజలకు ఇచ్చిన హామీల ను అమలు చేద్దామని ప్రతిపాదించారు. దీనికి సదరు మంత్రులు కూడా ఓకే చెప్పారు. తమకు కూడా అనుభవాలు ఎదురవు తున్నాయని.. ఎన్నికలకు ముందు తాము కూడా నియోజకవర్గాల్లో పర్యటించి.. పలుమౌఖిక హామీలు ఇచ్చామని.. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ మౌఖిక హామీల్లో కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాలతోపాటు.. ఆర్థికేత అంశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన సీఎం చంద్రబాబు.. వాటిని తక్షణమే అమలు చేస్తే.. ప్రజల్లో ప్రభుత్వంపై సంతృప్తి పెరుగుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ప్రభుత్వంపై భారం కాని మౌఖిక హామీలను ఈ నెలలోనే ప్రారంభించి అమలు చేయాలని సూచించారు. దీనికి ఒక నిర్ణయం తీసుకుని.. అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే.. రూ.10 లక్షలలోపు ఇచ్చిన మౌఖిక హామీలను కూడా నెరవేరిస్తే బాగుంటుందని మంత్రులు సూచించగా.. దానిపైనా ఒక నివేదిక తయారు చేయాలని చంద్రబాబు కోరారు. దీంతో ఈ నెల చివరి నుంచే ఆయా హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
ఇవీ.. మౌఖిక హామీలు..
This post was last modified on May 21, 2025 10:35 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…