Political News

ఇండియాను ఇస్లామిక్ దేశంగా మారుస్తాడట

తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా భారత్ లోని పలు కీలక నగరాల్లో వరుస పేలుళ్లకు వ్యూహాలు రచిస్తున్న విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహ్మాన్ సహా, హైదరాబాద్ లో అతడి పార్టనర్ సయ్యద్ సమీర్ లు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులతో భారీ ఉపద్రవమే తప్పిందని చెప్పాలి. అయితే విచారణలో భాగంగా సిరాజ్ ఎంతటి కరడుగట్టిన నేరస్తుడో ఇట్టే తేలిపోయింది. తవ్వుతున్న కొద్దీ అతడు చెబుతున్న విషయాలు వింటూ ఉంటే… ఈ తరహా ఉగ్రవాదులు కూడా ఉంటారా? అన్న అనుమానాలు కలగక మానవు.

అసలు సిరాజ్ లక్ష్యాలు ఏమిటన్న విషయానికి వస్తే… ఒళ్లు జలదరిస్తుంది. భారత్ ను ఇస్లామిక్ దేశంగా తీర్చిదిద్దడమే అతడి అంతిమ లక్ష్యమట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి ఉగ్రవాద దేశాలకే సాధ్యం కాని ఈ లక్ష్యం కోసం అతడు పనిచేయడం ప్రారంభించాడంటేనే నిజంగానే ఒళ్లు జలదరించక మానదు. ఇందుకు విద్వంసాన్నే మార్గంగా ఎంచుకున్న అతడు ఏకంగా మానవ బాంబులను తయారు చేసేందుకు సిద్ధపడ్డాడట. అందుకోసం పేలుడు పదార్థాల తయారీకి వినియోగించే పరికరాలతో పాటుగా ఆత్మాహుతి బాంబులుగా మారే వారిని కూడా సిద్ధం చేశాడట. ఈ భారీ లక్ష్యం కోసం పనిచేస్తున్న అతడికి అరబ్ దేశాల నుంచి భారీ ఎత్తున నిధులు అందుతూ వచ్చాయట.

విజయనగరం కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించడమే ఓ సాహసం అనుకుంటే… అక్కడి నుంచే సిరాజ్ హైదరాబాద్ సహఆ దేశంలోని పలు ప్రాంతాల్లోని తన ముఠా సభ్యులు, ఇతర దేశాల్లోని ఉగ్రవాద మాస్టర్ మైండ్లతోనూ నిత్యం సంప్రదింపులు జరిపాడు. అంతేనా… దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు అవసరమైన బాంబుల తయారీని కూడా అతడు విజయనగరం కేంద్రంగానే చేపట్టేందుకు సిద్ధపడటం గమనార్హం. ఇందుకోసం అతడు ఏకంగా టిఫిన్ బాక్సులు, బ్యాటరీలు వంటి వాటిని ఈ కామర్స్ సంస్థల నుంచి ఆర్డర్లు పెట్టి తెప్పించుకున్నాడట. మరికొంత కాలం పాటు అతడు దొరక్కపోయి ఉంటే… అతడు భారీ విధ్వంసానికే పాల్పడేవాడు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పిందని చెప్పాలి.

This post was last modified on May 20, 2025 11:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago