Political News

ఈడీ ఎంట్రీతో ఇక దబిడిదిబిదే!

ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు మంగళవారం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటిదాకా ఈ కేసును రాష్ట్రంలోని కూటమి సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుండగా… తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇదివరకే సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినా… కోర్టుల నుంచి ఆ సంస్థకు ఈ కేసు దర్యాప్తునకు అనుమతి లభించలేదు. అయితే మంగళవారం ఈడీకి ఈ కేసు దర్యాప్తునకు కోర్టు అనుమతి లభించింది.

ఈ కేసులో ఏ1గా ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే ఈడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ పై కోర్టు తన తీర్పును వెలువరించింది. కసిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ అధికారులకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తన తీర్పులో చెప్పింది. వెరసి ఈ కేసు దర్యాప్తులో ఈడీకి తొలి అడుగు పడినట్టేని చెప్పక తప్పదు.

కేసుల దర్యాప్తులో ఇతర సంస్థల విధి విధానాలకూ.. ఈడీ విధి విధానాలకు పూర్తిగా వైరుధ్యం ఉంటుంది. రాష్ట్ర పోలీసులు, ఏసీబీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసే కేసుల్లో ఆయా నిందితులపై మోపిన అభియోగాలను ఆయా దర్యాప్తు సంస్థలే రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ రుజువులను కాచుకుంటూ సాగితే… నిందితులు బయట పడిపోవచ్చు. అయితే ఈడీ దర్యాప్తులో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఈడీ నమోదు చేసే కేసుల్లో నిందితులపై మోపే అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాలి. అంటే… ఇతర దర్యాప్తు సంస్థలు అన్నింటికంటే ఈడీ దర్యాప్తు పూర్తి భిన్నమన్న మాట.

ఈ లెక్కన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిపై గానీ, ఇతరత్రా నిందితులపై గానీ నమోదు అయిన అభియోగాలను ఈడీ అధికారులు నిరూపించాల్సిన పనే లేదు. ఆ అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే.. తమ సత్యశీలతను నిందితులు తామే నిరూపించుకోవాలన్న మాట. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని న్యాయ నిపుణులు చెబుతారు. ఆయా కేసులపై ఎంతో అనుభవం, ఈడీ చట్టాలపై మంచి పట్టున్న వారు మాత్రమే ఈ కేసుల్లో నుంచి బయటపడతారని చెబుతారు. ఈ లెక్కన మద్యం కుంభకోణం దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీతో నిందితులందరికీ దబిడిదిబిడేనని చెప్పక తప్పదు.

This post was last modified on May 20, 2025 11:23 pm

Share
Show comments
Published by
Satya
Tags: ED

Recent Posts

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

40 minutes ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

3 hours ago

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

5 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

6 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

6 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

6 hours ago