ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు మంగళవారం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటిదాకా ఈ కేసును రాష్ట్రంలోని కూటమి సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుండగా… తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇదివరకే సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినా… కోర్టుల నుంచి ఆ సంస్థకు ఈ కేసు దర్యాప్తునకు అనుమతి లభించలేదు. అయితే మంగళవారం ఈడీకి ఈ కేసు దర్యాప్తునకు కోర్టు అనుమతి లభించింది.
ఈ కేసులో ఏ1గా ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే ఈడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ పై కోర్టు తన తీర్పును వెలువరించింది. కసిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ అధికారులకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తన తీర్పులో చెప్పింది. వెరసి ఈ కేసు దర్యాప్తులో ఈడీకి తొలి అడుగు పడినట్టేని చెప్పక తప్పదు.
కేసుల దర్యాప్తులో ఇతర సంస్థల విధి విధానాలకూ.. ఈడీ విధి విధానాలకు పూర్తిగా వైరుధ్యం ఉంటుంది. రాష్ట్ర పోలీసులు, ఏసీబీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసే కేసుల్లో ఆయా నిందితులపై మోపిన అభియోగాలను ఆయా దర్యాప్తు సంస్థలే రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ రుజువులను కాచుకుంటూ సాగితే… నిందితులు బయట పడిపోవచ్చు. అయితే ఈడీ దర్యాప్తులో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఈడీ నమోదు చేసే కేసుల్లో నిందితులపై మోపే అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాలి. అంటే… ఇతర దర్యాప్తు సంస్థలు అన్నింటికంటే ఈడీ దర్యాప్తు పూర్తి భిన్నమన్న మాట.
ఈ లెక్కన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిపై గానీ, ఇతరత్రా నిందితులపై గానీ నమోదు అయిన అభియోగాలను ఈడీ అధికారులు నిరూపించాల్సిన పనే లేదు. ఆ అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే.. తమ సత్యశీలతను నిందితులు తామే నిరూపించుకోవాలన్న మాట. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని న్యాయ నిపుణులు చెబుతారు. ఆయా కేసులపై ఎంతో అనుభవం, ఈడీ చట్టాలపై మంచి పట్టున్న వారు మాత్రమే ఈ కేసుల్లో నుంచి బయటపడతారని చెబుతారు. ఈ లెక్కన మద్యం కుంభకోణం దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీతో నిందితులందరికీ దబిడిదిబిడేనని చెప్పక తప్పదు.
This post was last modified on May 20, 2025 11:23 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…