Political News

ఈడీ ఎంట్రీతో ఇక దబిడిదిబిదే!

ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు మంగళవారం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటిదాకా ఈ కేసును రాష్ట్రంలోని కూటమి సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుండగా… తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇదివరకే సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినా… కోర్టుల నుంచి ఆ సంస్థకు ఈ కేసు దర్యాప్తునకు అనుమతి లభించలేదు. అయితే మంగళవారం ఈడీకి ఈ కేసు దర్యాప్తునకు కోర్టు అనుమతి లభించింది.

ఈ కేసులో ఏ1గా ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే ఈడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ పై కోర్టు తన తీర్పును వెలువరించింది. కసిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ అధికారులకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తన తీర్పులో చెప్పింది. వెరసి ఈ కేసు దర్యాప్తులో ఈడీకి తొలి అడుగు పడినట్టేని చెప్పక తప్పదు.

కేసుల దర్యాప్తులో ఇతర సంస్థల విధి విధానాలకూ.. ఈడీ విధి విధానాలకు పూర్తిగా వైరుధ్యం ఉంటుంది. రాష్ట్ర పోలీసులు, ఏసీబీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసే కేసుల్లో ఆయా నిందితులపై మోపిన అభియోగాలను ఆయా దర్యాప్తు సంస్థలే రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ రుజువులను కాచుకుంటూ సాగితే… నిందితులు బయట పడిపోవచ్చు. అయితే ఈడీ దర్యాప్తులో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఈడీ నమోదు చేసే కేసుల్లో నిందితులపై మోపే అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాలి. అంటే… ఇతర దర్యాప్తు సంస్థలు అన్నింటికంటే ఈడీ దర్యాప్తు పూర్తి భిన్నమన్న మాట.

ఈ లెక్కన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిపై గానీ, ఇతరత్రా నిందితులపై గానీ నమోదు అయిన అభియోగాలను ఈడీ అధికారులు నిరూపించాల్సిన పనే లేదు. ఆ అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే.. తమ సత్యశీలతను నిందితులు తామే నిరూపించుకోవాలన్న మాట. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని న్యాయ నిపుణులు చెబుతారు. ఆయా కేసులపై ఎంతో అనుభవం, ఈడీ చట్టాలపై మంచి పట్టున్న వారు మాత్రమే ఈ కేసుల్లో నుంచి బయటపడతారని చెబుతారు. ఈ లెక్కన మద్యం కుంభకోణం దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీతో నిందితులందరికీ దబిడిదిబిడేనని చెప్పక తప్పదు.

This post was last modified on May 20, 2025 11:23 pm

Share
Show comments
Published by
Satya
Tags: ED

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

3 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

5 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

5 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

6 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

7 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

8 hours ago