Political News

ఈడీ ఎంట్రీతో ఇక దబిడిదిబిదే!

ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు మంగళవారం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటిదాకా ఈ కేసును రాష్ట్రంలోని కూటమి సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుండగా… తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇదివరకే సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినా… కోర్టుల నుంచి ఆ సంస్థకు ఈ కేసు దర్యాప్తునకు అనుమతి లభించలేదు. అయితే మంగళవారం ఈడీకి ఈ కేసు దర్యాప్తునకు కోర్టు అనుమతి లభించింది.

ఈ కేసులో ఏ1గా ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే ఈడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ పై కోర్టు తన తీర్పును వెలువరించింది. కసిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ అధికారులకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తన తీర్పులో చెప్పింది. వెరసి ఈ కేసు దర్యాప్తులో ఈడీకి తొలి అడుగు పడినట్టేని చెప్పక తప్పదు.

కేసుల దర్యాప్తులో ఇతర సంస్థల విధి విధానాలకూ.. ఈడీ విధి విధానాలకు పూర్తిగా వైరుధ్యం ఉంటుంది. రాష్ట్ర పోలీసులు, ఏసీబీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసే కేసుల్లో ఆయా నిందితులపై మోపిన అభియోగాలను ఆయా దర్యాప్తు సంస్థలే రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ రుజువులను కాచుకుంటూ సాగితే… నిందితులు బయట పడిపోవచ్చు. అయితే ఈడీ దర్యాప్తులో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఈడీ నమోదు చేసే కేసుల్లో నిందితులపై మోపే అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాలి. అంటే… ఇతర దర్యాప్తు సంస్థలు అన్నింటికంటే ఈడీ దర్యాప్తు పూర్తి భిన్నమన్న మాట.

ఈ లెక్కన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిపై గానీ, ఇతరత్రా నిందితులపై గానీ నమోదు అయిన అభియోగాలను ఈడీ అధికారులు నిరూపించాల్సిన పనే లేదు. ఆ అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే.. తమ సత్యశీలతను నిందితులు తామే నిరూపించుకోవాలన్న మాట. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని న్యాయ నిపుణులు చెబుతారు. ఆయా కేసులపై ఎంతో అనుభవం, ఈడీ చట్టాలపై మంచి పట్టున్న వారు మాత్రమే ఈ కేసుల్లో నుంచి బయటపడతారని చెబుతారు. ఈ లెక్కన మద్యం కుంభకోణం దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీతో నిందితులందరికీ దబిడిదిబిడేనని చెప్పక తప్పదు.

This post was last modified on May 20, 2025 11:23 pm

Share
Show comments
Published by
Satya
Tags: ED

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago