కొలికపూడి శ్రీనివాసరావు పేరు ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. మొన్నటిదాకా రాజకీయాలతో పెద్దగా సంబంధం లేనట్టుగా సాగిన కొలికపూడి… అమరావతి పరిరక్షణ ఉద్యమంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. టీడీపీలో క్రియాశీల నేతగా ఎదిగారు. 2024లో తిరువూరు టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా..అసలు సమస్య అక్కడి నుంచే మొదలైంది. తన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోలేక నానా తిప్పలు పడుతున్న ఆయన తాజాగా… స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపుగా చతికిలబడిపోయారు.
తిరువూరు మునిసిపాలిటీని గతంలో వైసీపీ చేజిక్కించుకోగా… 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. రాష్ట్రంలోని మెజారిటీ స్థానిక సంస్థలు కూటమి ఖాతాలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో తిరువూరు మునిసిపాలిటీని కూడా కూటమి తన ఖాతాలో వేసుకునేందుకు రంగంలోకి దిగింది. లోకల్ ఎమ్మెల్యేగా కొలికపూడినే ఆ బాధ్యత తన భుజానికెత్తుకున్నారు. అయితే రాజకీయాల్లో అవసరమైన వ్యూహాలను రచించి అమలు చేయడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. వరుసగా సోమ, మంగళవారాల్లో తిరువూరు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక కోసం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినా… ఎమ్మెల్యే తన చతురతను మాత్రం చాటలేకపోయారు.
వాస్తవానికి కొలికపూడికి టీడీపీ అధిష్ఠానం వద్ద మంచి వెయిటే ఉంది. ఆయా అంశాలపై సమగ్ర పట్టు కలిగిన విద్యా వంతుడిగా, ఏ వియంపై అయినా అనర్గళంగా మాట్లాడే పట్టు కలిగిన నేతగా కొలికపూడికి మంచి పేరుంది. టీవీ డీబేట్లలో ఈ విషయం నిరూపితమైంది కూడా. రాజకీయాల్లోకి ప్రత్యక్ష ఎంట్రీ తర్వాత ఎందుకనో గానీ… తనదైన రూట్ ఎంచుకున్న కొలికపూడి నియోజకవర్గంలోని పార్టీకి చెందిన కీలక నేతలతో సఖ్యతగా మెలగలేకపోయారు. సఖ్యత మాట అటుంచితే వారితో మనస్పర్థలు లేకుండా సాగలేకపోయారు. ఈ క్రమంలో కొలికపూడిపై నేరుగా అధిష్ఠానానికే రెండు, మూడు సార్లు ఫిర్యాదులు వెళ్లగా పార్టీ అధినాయకత్వం మందలించింది కూడా. తాజాగా మునిసిపాలిటీపై పట్టు సాధించడంలోనూ విఫలమైన కొలికపూడి తన రాజకీయ భవిష్యత్తును మరింత ప్రమాదంలో పడేసుకున్నారని చెప్పాలి.
This post was last modified on May 20, 2025 10:59 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…