కొలికపూడి శ్రీనివాసరావు పేరు ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. మొన్నటిదాకా రాజకీయాలతో పెద్దగా సంబంధం లేనట్టుగా సాగిన కొలికపూడి… అమరావతి పరిరక్షణ ఉద్యమంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. టీడీపీలో క్రియాశీల నేతగా ఎదిగారు. 2024లో తిరువూరు టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా..అసలు సమస్య అక్కడి నుంచే మొదలైంది. తన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోలేక నానా తిప్పలు పడుతున్న ఆయన తాజాగా… స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపుగా చతికిలబడిపోయారు.
తిరువూరు మునిసిపాలిటీని గతంలో వైసీపీ చేజిక్కించుకోగా… 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. రాష్ట్రంలోని మెజారిటీ స్థానిక సంస్థలు కూటమి ఖాతాలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో తిరువూరు మునిసిపాలిటీని కూడా కూటమి తన ఖాతాలో వేసుకునేందుకు రంగంలోకి దిగింది. లోకల్ ఎమ్మెల్యేగా కొలికపూడినే ఆ బాధ్యత తన భుజానికెత్తుకున్నారు. అయితే రాజకీయాల్లో అవసరమైన వ్యూహాలను రచించి అమలు చేయడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. వరుసగా సోమ, మంగళవారాల్లో తిరువూరు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక కోసం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినా… ఎమ్మెల్యే తన చతురతను మాత్రం చాటలేకపోయారు.
వాస్తవానికి కొలికపూడికి టీడీపీ అధిష్ఠానం వద్ద మంచి వెయిటే ఉంది. ఆయా అంశాలపై సమగ్ర పట్టు కలిగిన విద్యా వంతుడిగా, ఏ వియంపై అయినా అనర్గళంగా మాట్లాడే పట్టు కలిగిన నేతగా కొలికపూడికి మంచి పేరుంది. టీవీ డీబేట్లలో ఈ విషయం నిరూపితమైంది కూడా. రాజకీయాల్లోకి ప్రత్యక్ష ఎంట్రీ తర్వాత ఎందుకనో గానీ… తనదైన రూట్ ఎంచుకున్న కొలికపూడి నియోజకవర్గంలోని పార్టీకి చెందిన కీలక నేతలతో సఖ్యతగా మెలగలేకపోయారు. సఖ్యత మాట అటుంచితే వారితో మనస్పర్థలు లేకుండా సాగలేకపోయారు. ఈ క్రమంలో కొలికపూడిపై నేరుగా అధిష్ఠానానికే రెండు, మూడు సార్లు ఫిర్యాదులు వెళ్లగా పార్టీ అధినాయకత్వం మందలించింది కూడా. తాజాగా మునిసిపాలిటీపై పట్టు సాధించడంలోనూ విఫలమైన కొలికపూడి తన రాజకీయ భవిష్యత్తును మరింత ప్రమాదంలో పడేసుకున్నారని చెప్పాలి.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…