ఏపీలోని కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకుల డోర్ డెలివరీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కూడా ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసింది. అంటే.. వైసీపీ పాలనలో ప్రారంభమైన రేషన్ సరుకుల డోర్ డెలివరీని కూటమి సర్కారు జూన్ 1 నుంచి రద్దు చేస్తుందన్న మాట. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
రేషన్ సరుకుల డోర్ డెలివరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం… వృద్ధులు, దివ్యాంగుల విషయంలో మాత్రం ఈ నిర్ణయాన్ని మినహాయించింది. ఇతరత్రా వర్గాలు జూన్ 1 నుంచి రేషన్ షాపులకు వెళ్లి రేషన్ సరుకులు తీసుకుని వెళ్లాల్సి ఉన్నా… వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఆయా రేషన్ షాపులు రేషన్ సరుకులను డోర్ డెలివరీ పద్దతిననే అందజేయనున్నాయి. ఫలితంగా వారికి ఈ నిర్ణయం నుంచి ప్రభావం పడదని చెప్పక తప్పదు.
ఏపీలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా 2019 దాకా రేషన్ సరుకులు రేషన్ షాపుల నుంచే అందేవి. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చాక రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందించాలని జగన్ నిర్ణయించారు. అందుకోసం వేల కొద్ది ఎండీయూ వాహనాలను కూడా కొనుగోలు చేశారు. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారు. రేషన్ సరుకుల డోర్ డెలివరీని ప్రారంభించారు. ఇందులో పలు లోటుపాట్లు కనిపించాయి. వాహనదారులకు ఈ పద్ధతి పెను భారంగా పరిణమించిందన్న వాదనలు వినిపించాయి.
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి… వైసీపీని చిత్తుగా ఓడించింది. ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కూటమి సర్కారు… జగన్ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను ఒక్కటొక్కటిగానే రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే జగన్ అమలు చేసిన పలు కీలక సంస్కరణలకు చెల్లుచీటి పలికిన కూటమి… తాజాగా రేషన్ డోర్ డెలివరీని కూడా రద్దు చేసింది. దీంతో రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం కొనుగోలు చేసిన వాహనాలను కూటమి సర్కారు ఎలా వినియోగిస్తుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on May 20, 2025 7:52 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…