Political News

కూట‌మి పాల‌నకు ఎన్ని మార్కులు వచ్చాయంటే

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఓట్లు.. 60.02 శాతం. ఈ లెక్క కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే చెప్పింది. ఇటీవ‌ల త‌ర‌చుగా సీఎం చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. అయితే.. 11 మాసాల త‌ర్వాత కూడా.. ఇది అలానే ఉందా? ఏమైనా మార్పు క‌నిపించిందా? అంటే.. మార్పులేద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వివిధ వ‌ర్గాల నుంచి రాబ‌ట్టిన స‌మాచారం బ‌ట్టి.. కూట‌మికి ప్ర‌జ‌లు వేసిన మార్కులు 60 శాతంగానే ఉన్నాయ‌ని తెలిసింది.

దీనిని బ‌ట్టి.. కూట‌మి పాల‌న‌కు ఫ‌స్ట్ క్లాస్ ద‌క్కింద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. అయితే.. అస‌లు విష యం ఏంటంటే.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ఓటు బ్యాంకు కేవ‌లం 15 -20 శాతం మాత్ర‌మే. అంటే.. వంద మంది ఓట‌ర్ల‌లో 15-20 మంది మాత్ర‌మే స‌ర్కారును ఉంచాలా? తుంచాలా? అనేది నిర్ణ‌యిస్తు న్నారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఓడించింది కేవ‌లం 2 శాతం మంది ఓట‌ర్లు మాత్ర‌మే. 2019లో టీడీపీని ఓడించింది.. 20 శాతం మంది ఓటర్లు.

ఇక‌, 2024 ఎన్నిక‌ల్లో టీడీపీకి 60.02 శాతం ఓట్లు రాగా.. వైసీపీకి 39.8 శాతం ఓట్లు వ‌చ్చాయి. అంటే.. వీటి తేడా.. సుమారు 20 శాతం. కాబ‌ట్టి.. ఇప్పుడు ఈ 60 శాతం సంతృప్తిలో ఓటు బ్యాంకును మార్చ‌గ‌ల వారు 15-20 శాతం మంది అలానే ఉన్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో వీరిలో 10 శాతం మంది వైసీపీ సానుభూతి ప‌రులుగా ఉన్నారు. వీరు ఆశిస్తున్న‌ది.. సూప‌ర్ సిక్స్‌లో కొత్త‌గా ఇచ్చిన హామీల అమ‌లు కాదు.. గ‌తంలో జ‌గ‌న్ అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను ఇప్పుడు కొన‌సాగించాల‌నే.

వీటిలో అమ్మ‌వొడి(ప్ర‌స్తుతం త‌ల్లికి వంద‌నం), రైతు భ‌రోసా(ప్ర‌స్తుతం అన్న‌దాత సుఖీభ‌వ‌) వంటివి. కానీ, స‌ర్కారు వీటిని అమ‌లు చేసేందుకు మీన మేషాలు లెక్కిస్తోంది. మేలోనే అన్న‌దాత ఇస్తామ‌ని చెప్పినా.. ఇప్ప‌టికి 20వ తారీకు వ‌చ్చినా.. దుక్కులు దున్ని రైతులు రెడీ అయినా.. ఫ‌లితం లేదు. ఇక, త‌ల్లికి వంద‌నం జూన్‌లో ఇస్తామ‌ని చెబుతున్నా.. మాట‌కే ప‌రిమితం అవుతున్నారు.ఇ వి ప్ర‌ధాన అసంతృప్తు లుగా క‌నిపిస్తున్నాయి. తాజా స‌ర్వేలోనూ తేలాయి. సో.. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ క్లాస్ మార్కులు ప‌డిన‌ప్ప‌టికీ.. ఆ 10 శాతం ఓటు బ్యాంకు యూట‌ర్న్ కాకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

This post was last modified on May 19, 2025 2:33 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

19 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

1 hour ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago