Political News

కూట‌మి పాల‌నకు ఎన్ని మార్కులు వచ్చాయంటే

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఓట్లు.. 60.02 శాతం. ఈ లెక్క కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే చెప్పింది. ఇటీవ‌ల త‌ర‌చుగా సీఎం చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. అయితే.. 11 మాసాల త‌ర్వాత కూడా.. ఇది అలానే ఉందా? ఏమైనా మార్పు క‌నిపించిందా? అంటే.. మార్పులేద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వివిధ వ‌ర్గాల నుంచి రాబ‌ట్టిన స‌మాచారం బ‌ట్టి.. కూట‌మికి ప్ర‌జ‌లు వేసిన మార్కులు 60 శాతంగానే ఉన్నాయ‌ని తెలిసింది.

దీనిని బ‌ట్టి.. కూట‌మి పాల‌న‌కు ఫ‌స్ట్ క్లాస్ ద‌క్కింద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. అయితే.. అస‌లు విష యం ఏంటంటే.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ఓటు బ్యాంకు కేవ‌లం 15 -20 శాతం మాత్ర‌మే. అంటే.. వంద మంది ఓట‌ర్ల‌లో 15-20 మంది మాత్ర‌మే స‌ర్కారును ఉంచాలా? తుంచాలా? అనేది నిర్ణ‌యిస్తు న్నారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఓడించింది కేవ‌లం 2 శాతం మంది ఓట‌ర్లు మాత్ర‌మే. 2019లో టీడీపీని ఓడించింది.. 20 శాతం మంది ఓటర్లు.

ఇక‌, 2024 ఎన్నిక‌ల్లో టీడీపీకి 60.02 శాతం ఓట్లు రాగా.. వైసీపీకి 39.8 శాతం ఓట్లు వ‌చ్చాయి. అంటే.. వీటి తేడా.. సుమారు 20 శాతం. కాబ‌ట్టి.. ఇప్పుడు ఈ 60 శాతం సంతృప్తిలో ఓటు బ్యాంకును మార్చ‌గ‌ల వారు 15-20 శాతం మంది అలానే ఉన్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో వీరిలో 10 శాతం మంది వైసీపీ సానుభూతి ప‌రులుగా ఉన్నారు. వీరు ఆశిస్తున్న‌ది.. సూప‌ర్ సిక్స్‌లో కొత్త‌గా ఇచ్చిన హామీల అమ‌లు కాదు.. గ‌తంలో జ‌గ‌న్ అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను ఇప్పుడు కొన‌సాగించాల‌నే.

వీటిలో అమ్మ‌వొడి(ప్ర‌స్తుతం త‌ల్లికి వంద‌నం), రైతు భ‌రోసా(ప్ర‌స్తుతం అన్న‌దాత సుఖీభ‌వ‌) వంటివి. కానీ, స‌ర్కారు వీటిని అమ‌లు చేసేందుకు మీన మేషాలు లెక్కిస్తోంది. మేలోనే అన్న‌దాత ఇస్తామ‌ని చెప్పినా.. ఇప్ప‌టికి 20వ తారీకు వ‌చ్చినా.. దుక్కులు దున్ని రైతులు రెడీ అయినా.. ఫ‌లితం లేదు. ఇక, త‌ల్లికి వంద‌నం జూన్‌లో ఇస్తామ‌ని చెబుతున్నా.. మాట‌కే ప‌రిమితం అవుతున్నారు.ఇ వి ప్ర‌ధాన అసంతృప్తు లుగా క‌నిపిస్తున్నాయి. తాజా స‌ర్వేలోనూ తేలాయి. సో.. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ క్లాస్ మార్కులు ప‌డిన‌ప్ప‌టికీ.. ఆ 10 శాతం ఓటు బ్యాంకు యూట‌ర్న్ కాకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Satya

Recent Posts

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

44 minutes ago

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

2 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

2 hours ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

2 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

3 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

3 hours ago