Political News

అనారోగ్యంతోనూ ‘తిరంగా’లో పవన్ కల్యాణ్

పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతిగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు జరిపిన ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా తిరంగా ర్యాలీల పేరిట భారీ ప్రదర్శనలను చేపట్టింది. విజయవాడలో చేపట్టిన ఈ ర్యాలీకి సీఎం నారా చంద్రబాబు నాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. నగరంలోని బందరు రోడ్డుపై నిర్వహించిన ఈ ర్యాలీలో కూటమి పార్టీల శ్రేణులతో పాటుగా పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు.

ఈ ర్యాలీలో తొలుత పవన్ కల్యాణ్ కనిపించలేదు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా అలా కనిపించి వెనక్కు వెళ్లిపోయిన ఆయన కాసేపు ముందు వరుసలో కనిపించలేదు. దీంతో పవన్ స్థానంలో మంత్రి నాదెండ్ల మనోహర్, బాబు, పురందేశ్వరి లతో కలిసి నడిచారు. అయితే పవన్ ఎక్కడా అని అంతా ఎదురు చూస్తుండగానే… తిరిగి పవన్ ర్యాలీలో ముందు వరుస లోకి వచ్చారు. జాతీయ జెండా చేతబట్టుకుని మరీ ఆయన భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ బాబు పక్కన ప్రత్యక్షమయ్యారు. అనంతరం 2.5 కిలో మీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో పవన్ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

ఇదిలా ఉంటే… ర్యాలీని బెంజ్ సర్కిల్ వద్ద ముగించిన కూటమి సర్కారు… అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి జనాన్ని ఉద్దేశించి కీలక నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్… గతంలో మాదిరిగా ఉద్వేగంగా మాట్లాడలేకపోయారు. ప్రసంగిస్తున్నంత సేపూ ఆయన తరచూ దగ్గుతూనే కనిపించారు. జలుబు, దగ్గుతో ఆయన బాధ పడుతున్నట్లుగా ఆయన తీరును బట్టి చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఈ సమస్యలతో బాధపడుతున్న పవన్.. తన ప్రసంగం మధ్యలో మంచి నీళ్లు తాగుతూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సాగారు. తన ప్రసంగంలో తెలుగు వీర జవాన్ మురళి జవాన్ ఘనతను చాటి చెప్పిన పవన్.. భారత దేశ సైన్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని పిలుపు ఇచ్చారు.

This post was last modified on May 17, 2025 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

34 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago