Political News

సెల‌బ్రిటీల నుంచి దేశ భ‌క్తి ఆశించొద్దు: ప‌వ‌న్

ఉగ్ర‌వాదాన్ని విడిచి పెట్ట‌క‌పోతే.. పాకిస్థాన్‌లోని ప్ర‌తి ఇంట్లోకీ దూరి మ‌రీ కొడ‌తామంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాయాది దేశాన్ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఇదే స‌మ‌యంలో సెల‌బ్రిటీలు(సినీ, క్రీడారంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు) నుంచి దేశ‌భ‌క్తిని ఆశించొద్ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన తిరంగా(జాతీయ ప‌తాకం) ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న‌.. అనంత‌రం బెంజి స‌ర్కిల్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. పాకిస్థాన్ ఉగ్ర‌మూక‌ల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తోంద‌న్న‌ది ప‌క్కా వాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. ఇలాంటి దేశంతో “అయ్యా.. బాబూ.. అని మాట్లాడ‌లేం. త‌న పంథాను మార్చుకోక‌పోతే..ఇళ్ల‌లోకి దూరి మ‌రీ కొడ‌తాం” అని హెచ్చ‌రించారు.

దేశ విభజన జరిగినప్పటి నుంచి భార‌త్‌కు ప్ర‌శాంత‌త క‌రువైంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. “మ‌నం అభివృద్ది చెందుతున్నాం. దీనిని చూసి ఓర్వ‌లేక పోతున్నారు. వాళ్ల‌ని మ‌నం అభివృద్ది చెందొద్ద‌ని చెప్పామా? ప్ర‌జ‌ల‌ను ధ‌న‌వంతుల‌ను చేసుకోవ‌ద్ద‌న్నామా? పాకిస్థాన్ ప్ర‌జ‌లు ఇత‌ర దేశాల్లో అడుక్కుతింటున్నారు(తాజాగా సౌదీ ప్ర‌భుత్వం పాక్ బిచ్చ‌గాళ్ల‌ను త‌రిమేసింది. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ..) అయినా.. ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఇలాంటి దేశాల‌కు త‌గిన విధంగా ప్ర‌ధాని మోడీ బుద్ధిచెబుతున్నారు” అని ప‌వ‌న్ అన్నారు.

ఉగ్ర‌వాద దాడుల‌కు మ‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు .. ప్ర‌స్తుత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాధితులేన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో ఏపీకి చెందిన ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని.. వారి కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌ని, వారు చేసిన పాపం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉమ్మ‌డి ఏపీలో.. హైద‌రాబాద్‌లోని గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్, జామా మసీదు పేలుళ్లను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. నాటి దాడుల్లో అంగ‌వైక‌ల్యం పొందిన వారి చూస్తే.. ఇప్ప‌టికీ త‌న‌కు మ‌న‌సు క‌రిగిపోతుంద‌న్నారు.

ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల‌కు కూడా ప‌వ‌న్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. వారి పేరును ఎక్క‌డా ప్ర‌స్తావించ‌ని ఆయ‌న‌.. ‘సెక్యుల‌రిస్టులు’ అని పేర్కొన్నారు. సెక్యుల‌రిజం పేరుతో కొంద‌రు సూడో(న‌కిలీ) సెక్యుల‌రిస్టులు తెర‌మీదికి వ‌స్తున్నార‌ని.. మ‌న దేశాన్ని, సైనికుల‌ను కూడా అవ‌మానించేలా.. ఆత్మ న్యూన‌త ఏర్ప‌డేలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. వీరికి కూడా స‌రైన స‌మ‌యంలో బుద్ధి చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను తాను కోరుతున్న‌ట్టు చెప్పారు. ఇదేస‌మ‌యంలో మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు.

సినీ రంగానికి చెందిన వారి నుంచి క‌ళారంగాల‌కు చెందిన వారి నుంచి దేశ భ‌క్తిని ఆశించొద్ద‌ని వ్యాఖ్యానించారు. “సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించవద్దు” అని పేర్కొన్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌నేది ప్ర‌శ్న‌. ఇటు ద‌క్షిణాదికి చెందిన సినీ న‌టులు, అటు ఉత్త‌రాదికి చెందిన న‌టుల్లో కొంద‌రు(ప‌ట్టుమ‌ని 10 మంది మాత్ర‌మే) మోడీకి అండ‌గా ఉన్నారు. మిగిలిన వారంతా మౌనంగా ఉన్నారు. బ‌హుశ ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ వ్యాఖ్యానించి ఉంటారు.

This post was last modified on May 17, 2025 10:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago