Political News

100 కోట్ల అక్ర‌మాలు: వంశీపై మ‌రో కేసు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ ఇప్ప‌ట్లో కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా వంశీ పై మ‌రో కేసు న‌మోదైంది. వైసీపీ హ‌యాంలో 2019-24 మ‌ధ్య గ‌న్న‌వ‌రంలో మైనింగ్ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న‌ది ఆయ‌న‌ పై తాజాగా వ‌చ్చిన అభియోగం. దీని పై మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వర్గం జ‌రిగిన మైనింగ్ అక్ర‌మాల‌ను కేసులో వివ‌రించారు.

దీంతో వంశీపై తాజాగా మ‌రో కేసు న‌మోదు చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయ‌ల విలువైన మైనింగ్ అక్ర మాలు చేశార‌ని వంశీపై కేసు న‌మోదు చేశారు. ఈ ప‌రిణామంతో వంశీకి మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గిలినట్టు అయింది. వాస్త‌వానికి టీడీపీ కార్యాల‌యం పై దాడి కేసులో వంశీకి బెయిల్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి న‌మోదైన స‌త్య‌వ‌ర్థ‌న్ కిడ్నాప్‌, బెదింపుల కేసులో బెయిల్ వ‌చ్చింది. కానీ, ఈలోగా ఎన్నికల కేసు న‌మోదైంది.

దీంతో బెయిల్ రావాల్సి ఉంది. ఈ బెయిల్ పిటిష‌న్లు ఒక‌వైపు విచార‌ణ‌లో ఉండ‌గానే.. తాజాగా న‌మోదైన మైనింగ్ కేసులో వంశీని మ‌రోసారి అరెస్టు చేసే అవ‌కాశం ఉంది. ఇక గురువారం రాత్రి వైసీపీ హ‌యాంలో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీ పై పీటీ వారెంట్ న‌మోదు చేసేందుకు నూజివీడు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. కేసు న‌మోదు చేసి విచార‌ణ చేయ‌డంతో పాటు.. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.

దీంతో ఆ కేసు కూడా మెడకు చుట్టుకుంది. మొత్తంగా చూస్తే.. వంశీ పై కేసులు వ‌రుస పెట్టి న‌మోదు అవుతుండ‌డం.. ఆయ‌న ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 16, 2025 2:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago