వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో కేసుల నుంచి బయటపడేలా కనిపించడం లేదు. తాజాగా వంశీ పై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో 2019-24 మధ్య గన్నవరంలో మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆయన పై తాజాగా వచ్చిన అభియోగం. దీని పై మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గన్నవరం నియోజకవర్గం జరిగిన మైనింగ్ అక్రమాలను కేసులో వివరించారు.
దీంతో వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన మైనింగ్ అక్ర మాలు చేశారని వంశీపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో వంశీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీకి బెయిల్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి నమోదైన సత్యవర్థన్ కిడ్నాప్, బెదింపుల కేసులో బెయిల్ వచ్చింది. కానీ, ఈలోగా ఎన్నికల కేసు నమోదైంది.
దీంతో బెయిల్ రావాల్సి ఉంది. ఈ బెయిల్ పిటిషన్లు ఒకవైపు విచారణలో ఉండగానే.. తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీని మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక గురువారం రాత్రి వైసీపీ హయాంలో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీ పై పీటీ వారెంట్ నమోదు చేసేందుకు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేయడంతో పాటు.. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.
దీంతో ఆ కేసు కూడా మెడకు చుట్టుకుంది. మొత్తంగా చూస్తే.. వంశీ పై కేసులు వరుస పెట్టి నమోదు అవుతుండడం.. ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 16, 2025 2:58 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…