వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో కేసుల నుంచి బయటపడేలా కనిపించడం లేదు. తాజాగా వంశీ పై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో 2019-24 మధ్య గన్నవరంలో మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆయన పై తాజాగా వచ్చిన అభియోగం. దీని పై మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గన్నవరం నియోజకవర్గం జరిగిన మైనింగ్ అక్రమాలను కేసులో వివరించారు.
దీంతో వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన మైనింగ్ అక్ర మాలు చేశారని వంశీపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో వంశీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీకి బెయిల్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి నమోదైన సత్యవర్థన్ కిడ్నాప్, బెదింపుల కేసులో బెయిల్ వచ్చింది. కానీ, ఈలోగా ఎన్నికల కేసు నమోదైంది.
దీంతో బెయిల్ రావాల్సి ఉంది. ఈ బెయిల్ పిటిషన్లు ఒకవైపు విచారణలో ఉండగానే.. తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీని మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక గురువారం రాత్రి వైసీపీ హయాంలో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీ పై పీటీ వారెంట్ నమోదు చేసేందుకు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేయడంతో పాటు.. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.
దీంతో ఆ కేసు కూడా మెడకు చుట్టుకుంది. మొత్తంగా చూస్తే.. వంశీ పై కేసులు వరుస పెట్టి నమోదు అవుతుండడం.. ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 16, 2025 2:58 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…