కాశ్మీర్ కోసం దశాబ్దాలుగా భారత్పై దొంగదారిలో విరుచుకుపడుతూ, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్కు ఇప్పుడు చుట్టు పక్కల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. కాశ్మీర్ కావాలని పాకిస్థాన్ ఎంతగా ప్రయత్నించినా, ఇప్పుడు తనే ఆక్రమించి ఉన్న బలూచిస్థాన్ను చేజార్చుకునే పరిస్థితి తెచ్చుకుంది. స్వతంత్ర బలూచిస్థాన్ కోసం పోరాటం చేస్తున్న నేతలు, ప్రజలు బహిరంగంగానే తమ వాయిస్ వినిపిస్తూ ‘పాకిస్థాన్ మాకు అవసరం లేదు’ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఈ మాటలకు నిదర్శనం.
తాజాగా బలూచ్ ప్రతినిధి మీర్ యార్ బలోచ్ చేసిన ప్రకటన పాకిస్థాన్కు మరో షాక్లాంటిది. “మేము పాకిస్థానీయులు కాదంటూ” ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. కొన్నేళ్లుగా పాక్ దుర్మార్గాలను భరించిన బలూచ్ జనతా ఇప్పుడు మౌనంగా ఉండే పరిస్థితిలో లేరు. భారత్ పీవోకేపై చర్యలు తీసుకునే సమయంలోనే బలూచిస్థాన్ నుంచి వచ్చిన స్వరాలు పాక్ను అర్థరాత్రి నిద్రలేపేలా ఉన్నాయి.
ఇక పాక్కు నిజంగా మిత్ర దేశాలే మిగిలేనా అనే సందేహం కూడా వినిపిస్తోంది. ఉగ్రవాదంపై మద్దతు నిలిపి పెట్టమన్న ప్రపంచ దేశాల మాటకు చెవిచెయ్యని ఇస్లామాబాద్, ఇప్పుడు తాను ఆక్రమించిన భూభాగాన్నే పోగొట్టుకునే పరిస్థితిలోకి వచ్చిందంటే ఇదే కర్మ ఫలితమే అనుకోవాలనే కామెంట్స్ వస్తున్నాయి. సొంత రాష్ట్రమే చెబుతోందంటే, పాక్కు మరెవరి బలం పనికిరాదని స్పష్టమవుతోంది. అసలే బలూచిస్థాన్ నుంచే పాక్ కు ఆదాయం వనరులు సమకూరుతున్నాయి. గోల్డ్, బొగ్గు, గ్యాస్ లాంటి ఖనిజ వనరులు ఆ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి బలూచిస్థాన్ చేజారింది అంటే పాక్ సర్దుకోవాల్సిందే.
This post was last modified on May 15, 2025 11:19 am
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…