ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనల నిమిత్తం కొత్త హెలికాప్టర్ను కొనేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీసీఏ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ పనితీరును అధ్యయనం చేయనుంది. అదేవిధంగా కొత్తగా కొనుగోలు చేయాలని భావిస్తున్న హెలికాప్టర్ విషయంపైనా సూచనలు, సలహాలు ఇవ్వనుంది. ఈ మేరకు సదరు ఉత్తర్వుల్లో కమిటీకి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలనుంచి భారీఎత్తున కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. మరో వైపు పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు.. మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు, రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా జరిపే పర్యటనలు మరింత జోరుగా సాగనున్నాయి. ప్రస్తుతం హెలికాప్టర్ ఉన్నప్పటికీ.. దాని సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తదానిని కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిని సీఎంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.
This post was last modified on May 15, 2025 10:18 am
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…