Political News

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు విజ‌య‌వాడ‌లోని జైలుకు త‌రలిం చారు. జ‌గ‌న్ పాల‌న‌లో నాసిర‌కం మ‌ద్యాన్ని భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యించారు. అంతేకాదు.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న కంపెనీల కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు. మ‌ద్యం త‌యారీ నుంచి అమ్మ‌కాల వ‌ర‌కు బాటిల్ బాటిల్‌కు ఇంత‌ని రేటు క‌ట్టి వ‌సూలు చేశారని మ‌ద్యం కుంభ‌కోణంపై కూటమి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం గుర్తించింది.

ఇలా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఎక్క‌డ దాచాలి? ఏయే మార్గాల్లో త‌ర‌లించాల‌న్న కీల‌క విష‌యాల‌ను భార‌తీ సిమెంట్స్ శాశ్వ‌త డైరెక్ట‌ర్‌, ప్ర‌ముఖ ఆడిట‌ర్ బాలాజీ గోవింద‌ప్పే చూసుకున్నార‌న్న‌ది అధికారులు చెబుతున్న విష‌యం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను ఈ కేసులో ఏ-33గా పేర్కొన్నారు. మిగిలిన ప్ర‌ధాన నిందితుల‌తో పాటు ఆయ‌న కోసం కూడా గాలించారు. తొలుత నోటీసులు ఇచ్చినా.. ఆయ‌న క‌నిపించ‌లేదు. దీంతో హైద‌రాబాద్‌లోని ఇంటికి వెళ్లి మ‌రీ కుటుంబ స‌భ్యుల‌కు నోటీసులు ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ బాలాజీ గోవింద‌ప్ప స్పందించ‌లేదు.

మ‌రోవైపు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముంద‌స్తు బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. వీటిని ప‌దే ప‌దే కోర్టులు తోసిపుచ్చాయి. ఈ క్ర‌మంలో మ‌రింత ముమ్మ‌రంగా గాలించిన సిట్ అధికారులు మంగ‌ళ‌వారం ఉద‌య‌మే బాలాజీ గోవింద‌ప్ప అడ్ర‌స్ ప‌ట్టుకున్నారు. మైసూరులో ఉన్నాడ‌ని తెలుసుకుని అక్క‌డ‌కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బుధ‌వారం ఉద‌యం ఆయ‌న‌ను విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చి.. ఆరోగ్య ప‌రీక్ష‌ల అనంత‌రం.. ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆ ఇద్ద‌రు సిట్ ముందుకు..

ఇక‌, ఇదే కేసులో కీల‌క నిందితులుగా భావిస్తున్న ఏ-31, ఏ-32లు ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిలు బుధ‌వారం విజ‌య‌వాడలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ముందు హాజ‌ర‌య్యారు. దీంతో వీరిని సిట్ అధికారులు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు విచారించారు. మ‌ద్యం కుంభ‌కోణంలో వీరి పాత్ర‌పై ఆరా తీశారు. అయితే.. త‌మ‌కు ఏమీ తెలియ‌ద‌ని.. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే న‌డుచుకున్నామ‌ని.. కావాలంటే త‌మ బ్యాంకు ఖాతాల‌ను చెక్ చేసుకోవ‌చ్చ‌ని ఇరువురు చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే.. సిట్ అధికారుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకోవ‌డంపైనా అధికారులు ఆరా తీసిన‌ట్టు స‌మాచారం.

This post was last modified on May 14, 2025 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతాప్ కోరుకున్న పుణ్యం ఏమయ్యింది

హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…

20 minutes ago

సూపర్ స్టార్ కొడుకు జీతం రూ.4500

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…

52 minutes ago

అజారుద్దీన్ మంత్రిగిరీ సేఫేనా…?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…

1 hour ago

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం… అజెండా ఏంటి?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…

3 hours ago

వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?

తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…

4 hours ago

జ‌గ‌న్‌కు రెస్ట్‌… నాయ‌కుల‌కు టార్గెట్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి.. యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…

7 hours ago