Political News

ప్రతీకార దినోత్సవం… మ్యాటరేంటి?

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రాజు గారు.. ఆ తర్వాత వైసీపీ విధానాలు నచ్చక ఆ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు. జగన్ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను ఆయన బహిరంగంగానే ఎండగట్టారు. ఫలితంగా సిట్టింగ్ ఎంపీగా ఉండి అరెస్టయ్యారు. పోలీసుల అదుపులో లాఠీదెబ్బలూ తిన్నారు. ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గ పరిధిలో బుధవారం ప్రతీకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు.

సరే.. మరి రాజుగారు ఏం చేసినా చాలా వెరైటీగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. రేపు తన నియోజకవర్గ పరిధిలో ప్రతీకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించిన రాజు గారు..నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా ఈ దినోత్సవంలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తనకు వైసీపీ పాలనలో జరిగిన హింసపై నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నాటి ప్రభుత్వ దమననీతిపైనా, నాటి ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తుతూ సాగిన అధికారుల తీరుకు నిరసనగానే ఈ ప్రతీకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇక అసలు విషయంలోకి వెళితే… ఓ వ్యాపారవేత్తగా ఉన్న రఘురామ వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తనకు టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. ఏమైందో తెలియదు గానీ… 2019 ఎన్నికలకు చివరి నిమిషంలో బీజేపీని వీడిన ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరారు. నరసాపురం ఎంపీ టికెట్ సంపాదించారు. ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. వైసీపీలో ఉన్నా… బీజేపీలో కీలక నేతలు ప్రదాని నరేంద్ర మోదీ సహా చాలా మంది నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరపారు. తెలుగు బాషపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి రాజు గారు… ఆ పార్టీకి దూరమైపోయారు.

ఈ క్రమంలో జగన్, వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డిలపై వరుసగా విమర్శలు చేసిన రాజుగారిపై 2021 మే 14న ఏపీ పోలీసులు ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారు. నరసాపురంలో ఆయన అడుగే పెట్టకుండా చేశారు. చివరకు హైదరాబాద్ కూ రాకుండా ఆయనను తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. ఈ క్రమంలో తన ఇంటిలో ఓ శుభకార్యం నిమిత్తం హైదరాబాద్ రాగా… రాజు గారిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు సీఐడీ అదికారులు తమ కస్టడీలో రాజు గారిపై తమ ప్రతాపం చూపారు. ఈ గాయాలను పంటి బిగువున భరించిన రాజు గారు..ఆ మరునాడు తనకు అయిన గాయాలను మీడియాతో పాటు న్యాయమూర్తికి చూపించి జగన్ అండ్ కోను అడ్డంగా బుక్ చేశారు. ఈ క్రమంలో బుధవారం జరిగే ప్రతీకార దినోత్సవంలో రాజు గారు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

This post was last modified on May 14, 2025 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

4 hours ago