Political News

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు లేవు. ఏటా మే నెల 27 నుంచి మొదలై మూడు రోజుల పాటు కన్నులపండువగా జరుగుతున్న మహానాడును ఈదఫా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్వహిస్తున్నారు. కడప నగరానికి అత్యంత సమీపంలో సీకే దిన్నే మండల కేంద్రంగా జరగనున్న ఈ వేడుకకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం లోకేశ్… పలువురు మంత్రులతో పాటు పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మహానాడు షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు అవసరం లేదని లోకేశ్ తేల్చి చెప్పారు. పహల్ గాం ఉగ్రదాడి, దానికి ప్రతిగా భారత త్రివిధ దళాలు పాక్ భూభాగం కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధం వేళ మహానాడు అవసరమా? అని లోకేశ్ సహా పార్టీ అదినేత చంద్రబాబు కూడా ఆలోచించారు.

అయితే అప్పటికే స్థల ఎంపిక, పరిశీలన, ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక చర్యలు మొదలయ్యాయి. అదే సమయంలో భారత భీకర దాడికి తట్టుకోలేని పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో యుద్ధం దాదాపుగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాల్సిన అసవరం లేదని టీడీపీ భావించింది. అందులో భాగంగానే మహానాడు ఏర్పాట్లకు సంబంధించిన బుథవారం లోకేశ్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహానాడును యథాతథంగా నిర్వహణకే అందరు నేతలు అంగీకరించారు.

ఇదిలా ఉంటే..మహానాడుకు ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా శాఖలు మినీ మహానాడును నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో లోకేశ్ తీర్మానించారు. ఇది కూడా కొత్త పద్దతేమీ కాదు. ఏటా మహానాడు… దానికి ముందుగా జిల్లాల్లో మినీ మహానాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మినీ మహానాడులను ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా కార్యవర్గాలను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మహానాడుకు తరలివెళ్లేందుకు సన్నాహక సమావేశాలుగా వీటిని పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on May 14, 2025 5:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago