Political News

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు లేవు. ఏటా మే నెల 27 నుంచి మొదలై మూడు రోజుల పాటు కన్నులపండువగా జరుగుతున్న మహానాడును ఈదఫా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్వహిస్తున్నారు. కడప నగరానికి అత్యంత సమీపంలో సీకే దిన్నే మండల కేంద్రంగా జరగనున్న ఈ వేడుకకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం లోకేశ్… పలువురు మంత్రులతో పాటు పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మహానాడు షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు అవసరం లేదని లోకేశ్ తేల్చి చెప్పారు. పహల్ గాం ఉగ్రదాడి, దానికి ప్రతిగా భారత త్రివిధ దళాలు పాక్ భూభాగం కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధం వేళ మహానాడు అవసరమా? అని లోకేశ్ సహా పార్టీ అదినేత చంద్రబాబు కూడా ఆలోచించారు.

అయితే అప్పటికే స్థల ఎంపిక, పరిశీలన, ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక చర్యలు మొదలయ్యాయి. అదే సమయంలో భారత భీకర దాడికి తట్టుకోలేని పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో యుద్ధం దాదాపుగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాల్సిన అసవరం లేదని టీడీపీ భావించింది. అందులో భాగంగానే మహానాడు ఏర్పాట్లకు సంబంధించిన బుథవారం లోకేశ్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహానాడును యథాతథంగా నిర్వహణకే అందరు నేతలు అంగీకరించారు.

ఇదిలా ఉంటే..మహానాడుకు ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా శాఖలు మినీ మహానాడును నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో లోకేశ్ తీర్మానించారు. ఇది కూడా కొత్త పద్దతేమీ కాదు. ఏటా మహానాడు… దానికి ముందుగా జిల్లాల్లో మినీ మహానాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మినీ మహానాడులను ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా కార్యవర్గాలను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మహానాడుకు తరలివెళ్లేందుకు సన్నాహక సమావేశాలుగా వీటిని పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on May 14, 2025 5:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కండల వీరుడి సినిమాకు ‘చైనా’ కష్టాలు

యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు…

46 minutes ago

నదిలో 11,000 లీటర్ల పాలు.. ప్రకృతికి మంచిదేనా?

మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…

2 hours ago

మీడియాలోకి సాయిరెడ్డి.. పక్షపాతం లేకుండా…!

అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…

2 hours ago

చిరంజీవి చుట్టూ డబుల్ అయోమయం

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…

3 hours ago

శేష్ కెపాసిటీ ఏంటో అర్థమయ్యిందిగా

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…

3 hours ago

పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వానికి ఉచితాలు ఎందుకు

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…

4 hours ago