Political News

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని అధికారిక నివాసం ‘వర్ష’లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫడ్నవీస్ కూడా ‘ఎక్స్’ వేదికగా రోహిత్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫొటోలను పంచుకున్నారు. దీంతో రోహిత్ రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

రోహిత్ శర్మ ఫడ్నవీస్‌ను కలవడం యాదృచ్ఛికమేనో లేక ఆలోచిత ప్రక్రియలో భాగమో స్పష్టత లేకపోయినా, ఈ సమావేశానికి వచ్చిన ప్రజా స్పందన ఆసక్తికరంగా మారింది. గతంలో పలువురు క్రికెటర్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో రోహిత్‌పై కూడా రాజకీయ ఆశలు రేగుతున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన రోహిత్‌కు మహారాష్ట్రలో మంచి క్రేజ్ ఉంది. అదే క్రమంలో రాజకీయ రంగంలోకి వెళ్లాలనే ఆలోచన ఉంటే ఆయనకు ప్రత్యేకించి క్యాంపెయిన్ అవసరం ఉండకపోవచ్చు. ఇక క్రికెట్ కెరీర్ కు చివరి రోజుల్లో ఏకంగా సీఎంను కలవడంతో సోషల్ మీడియాలో అలజడి మొదలైంది.

ఓవైపు రోహిత్ తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలకగా, మరోవైపు వన్డే, టీ20ల్లో తాను కొనసాగుతానని సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వన్డే కెప్టెన్సీ కొనసాగుతుందా లేదా అనేది ప్రస్తుతం క్లారిటీ లేదు. ఇలాంటి వేళే ఫడ్నవీస్‌తో భేటీ కావడం వెనుక రాజకీయ భవిష్యత్తుకు సన్నాహమేనా? అనే అనుమానాలకు తావిస్తోంది.

రోహిత్ టెస్ట్ కెరీర్‌ను పరిశీలిస్తే, తన అరంగేట్రం నుంచి చివరి వరకు ఎంతో శ్రమించి స్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. 67 టెస్టుల్లో 12 సెంచరీలు, 4,301 పరుగులతో భారత టెస్ట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఐసీసీ డబ్ల్యూటీసీలో అతని ప్రదర్శన అత్యుత్తమంగా నిలిచింది. ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చిన తర్వాత కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు రోహిత్ వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తిరుగుతుందా? రాజకీయ రంగప్రవేశానికి బాటలు సిద్ధమవుతున్నాయా? అన్నది మరికొద్ది రోజులలో స్పష్టమవుతుంది.

This post was last modified on May 14, 2025 2:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

1 hour ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago