Political News

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని అధికారిక నివాసం ‘వర్ష’లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫడ్నవీస్ కూడా ‘ఎక్స్’ వేదికగా రోహిత్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫొటోలను పంచుకున్నారు. దీంతో రోహిత్ రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

రోహిత్ శర్మ ఫడ్నవీస్‌ను కలవడం యాదృచ్ఛికమేనో లేక ఆలోచిత ప్రక్రియలో భాగమో స్పష్టత లేకపోయినా, ఈ సమావేశానికి వచ్చిన ప్రజా స్పందన ఆసక్తికరంగా మారింది. గతంలో పలువురు క్రికెటర్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో రోహిత్‌పై కూడా రాజకీయ ఆశలు రేగుతున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన రోహిత్‌కు మహారాష్ట్రలో మంచి క్రేజ్ ఉంది. అదే క్రమంలో రాజకీయ రంగంలోకి వెళ్లాలనే ఆలోచన ఉంటే ఆయనకు ప్రత్యేకించి క్యాంపెయిన్ అవసరం ఉండకపోవచ్చు. ఇక క్రికెట్ కెరీర్ కు చివరి రోజుల్లో ఏకంగా సీఎంను కలవడంతో సోషల్ మీడియాలో అలజడి మొదలైంది.

ఓవైపు రోహిత్ తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలకగా, మరోవైపు వన్డే, టీ20ల్లో తాను కొనసాగుతానని సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వన్డే కెప్టెన్సీ కొనసాగుతుందా లేదా అనేది ప్రస్తుతం క్లారిటీ లేదు. ఇలాంటి వేళే ఫడ్నవీస్‌తో భేటీ కావడం వెనుక రాజకీయ భవిష్యత్తుకు సన్నాహమేనా? అనే అనుమానాలకు తావిస్తోంది.

రోహిత్ టెస్ట్ కెరీర్‌ను పరిశీలిస్తే, తన అరంగేట్రం నుంచి చివరి వరకు ఎంతో శ్రమించి స్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. 67 టెస్టుల్లో 12 సెంచరీలు, 4,301 పరుగులతో భారత టెస్ట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఐసీసీ డబ్ల్యూటీసీలో అతని ప్రదర్శన అత్యుత్తమంగా నిలిచింది. ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చిన తర్వాత కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు రోహిత్ వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తిరుగుతుందా? రాజకీయ రంగప్రవేశానికి బాటలు సిద్ధమవుతున్నాయా? అన్నది మరికొద్ది రోజులలో స్పష్టమవుతుంది.

This post was last modified on May 14, 2025 2:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

9 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

27 minutes ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

51 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

57 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

1 hour ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago