Political News

వారి గురుంచి ఆరా తీస్తున్న జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో ప‌దవులు ద‌క్కించుకున్న‌ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెల‌కు 3 ల‌క్ష‌ల‌కు పైగానే వేత‌నాల రూపంలో తీసుకుని.. ఇత‌ర భ‌త్యాలు కూడా తీసుకున్న‌ వారు.. ఇప్పుడు ఏమ‌య్యారు? ఈ ప్ర‌శ్న రాజ‌కీయ వ‌ర్గాల్లో కాదు.. ఆయా ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టిన వైపీసీ అధినేత జ‌గ‌న్ సంధిస్తున్నారు.

“ప్ర‌స్తుతం వారంతా ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? ఒక్క‌సారి నాకు ఫోన్‌క‌ల‌పండి!” అని జ‌గ‌న్ చెప్పి న‌ట్టు తెలిసింది. అయితే.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వ‌స్తున్నాయ‌ని.. అందుబాటులో లేర‌ని.. పార్టీ కీల‌క నాయకుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే చెప్పుకొచ్చారు. ఇక‌, అప్ప‌ట్లో ప‌ద‌వులు పొందిన వారిలో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు దేవులప‌ల్లి అమ‌ర్ స‌హా 89 మందిని స‌ల‌హాదారుల‌గా నియమించారు. వీరిలో ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ప్ర‌స్తుతం పార్టీకి అందుబాటులో ఉన్నారు.

మిగిలిన వారిలో ఎవ‌రూ కూడా పార్టీకి, పార్టీ అధినేత‌కు కూడా అందుబాటులో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ప్ర‌స్తుతం పార్టీకి స‌ల‌హాలు కావాల‌ని కోరుతున్నా.. పార్టీ పుంజుకునేలా వ్యూహాలు ర‌చించాల‌ని పిలుపునిస్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ప్ర‌భుత్వం మారిన వెంట‌నే .. చాలా మంది మౌనం పాటించారు. మ‌రికొంద‌రు రాజ‌కీయాల‌కు కూడా దూర‌మ‌య్యారు. వీరి జాబితా.. వారు తీసుకున్న జీత భ‌త్యాలు పెద్ద‌దే. అయినా.. ఇప్పుడు మాత్రం ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు.

ఇదీ.. జ‌గ‌న్ అడిగిన జాబితా!

— జగన్‌ రాసిపెట్టే జీవీడీ కృష్ణమోహన్‌ను కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా నియమించారు.

— దేవులపల్లి అమర్‌ను జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియమించారు.

— సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుని చేశారు.

— శాననమండలిలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గంగుల ప్రభాకర్‌రెడ్డిని జలవనరులశాఖ సలహాదారుగా నియమించారు.

— మైనార్టీ సంక్షేమ శాఖకు జియావుద్దీన్, హబీవుల్లా, మహమ్మద్‌ అలీ బాగ్దాదీ, మద్దు బాలస్వామి అనే నలుగురు సలహాదారుల్ని నియమించింది.

— ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డి.ని సలహాదారు ని చేశారు.

— ఆలూరు సాంబశివారెడ్డిని పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శిగా నియమించింది. కేబినెట్‌ ర్యాంక్‌తో విద్యాశాఖ సలహాదారుగా నియమించింది.

— వైసీపీ నాయకుడు చల్లా మధుసూదన్‌రెడ్డిని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సలహాదారుగా నియమించింది.

— పీటర్‌ టి.హసన్‌ అనే వ్యక్తిని ‘ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌’ సలహాదారుగా, కృష్ణ జి.వి.గిరిని ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ సలహాదారుగా నియమించారు.

— ఆర్‌.వీరారెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు ఎస్‌. రాజీవ్‌ కృష్ణలకు సలహాదారు పదవులు కట్టబెట్టారు.

— మాజీ సీఎస్‌ నీలం సాహ్నీ పదవీ విరమణ చేసిన వెంటనే సలహాదారుగా నియమించారు.

— జగన్‌ హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ని కేబినెట్‌ హోదాతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.

— ఎన్నారై సలహాదారుగా జుల్ఫీ రవ్‌ద్జీ అనే వ్యక్తిని నియమించారు.

This post was last modified on May 14, 2025 3:49 pm

Share

Recent Posts

దారిన ప‌డుతున్న నేత‌లు… `వైసీపీకి నో ఛాన్స్‌!`

స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల మ‌ధ్య చిరాకులు, ప‌రాకుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌మ‌కు అది మేలు చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీకి…

27 minutes ago

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

2 hours ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

2 hours ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

6 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

7 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

7 hours ago