వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు దక్కించుకునేందుకు ఈ పట్టు బాగా పనిచేసింది. అయితే.. ఒక్క ఓటమితో ఈ పట్టు కదలిపోతోందన్న చర్చ తెరమీదికి వచ్చింది. ఇటీవల కీలక నాయకుడు, కొడాలికి రాజకీయ సహచరుడిగా మెలిగి, ఆయనకువెన్నుదన్నుగా ఉన్న కీలక నాయకుడు ఒకరు కొడాలికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. నిజానికి ఆయన చాలా బలమైన మద్దతుదారు.
పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి నాయకుడు ఇటీవల కొడాలిని పక్కన పెట్టారు. ఇక, తాజాగా మైనారిటీ నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న.. మహమ్మద్ ఖాసిం కూడా వైసీపీకి రాజీనామా చేశారు. నిజానికి పార్టీకి ఆయన రాజీనామా చేసినా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, మైనారిటీ ఓటు బ్యాంకును కొడాలికి చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు కావడంతో ఆయన వ్యవహారం చర్చకు దారితీసింది.
అంతేకాదు.. ఆయన కొడాలిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాని వైఖరితో విసిగిపోయామని చెప్పు కొచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని కూడా ప్రకటించారు. ఎన్నికలకు ముందు తర్వాత.. నానిలో చాలా మార్పు కనిపించిందన్న ఆయన.. ఎన్నికల తర్వాత మొత్తం పార్టీని గాలికి వదిలేశారని నానీపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. బలమైన మైనారిటీ నాయకుడు ఇలా పార్టీకి.. నానీకి కూడా రాం రాం చెప్పడం చర్చనీయాంశం అయింది.
వాస్తవానికి పార్టీలో నాయకులు కొందరు పోతూ ఉంటారు వస్తూ వుంటారు. కానీ, బలమైన ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల ఖాసిం వంటినాయకులను తయారు చేసుకోవడం చాలా కష్టం. గతంలో కొడాలి నాని.. ఖాసింని చూపిస్తూ.. నా తమ్ముడు.. నా బలం అని చెప్పుకొచ్చారు. ఏ సమస్య ఉన్నా.. ఖాసింకి చెబితే.. తనకు చెప్పినట్టేనని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి నాయకుడే ఛీ కొట్టడంతో కొడాలికి కూసాలు కదులుతున్నాయా? అనే చర్చకు దారి తీసింది. మరి కొడాలి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 14, 2025 1:30 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…