పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. గత నెల 23న పొరపాటున అంతర్జాతీయ రేఖను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన ఆయన అక్కడి రేంజర్లకు చిక్కారు. దాంతో 3 వారాల పాటు పాక్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. చివరికి బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం అతన్ని అట్టారీ చెక్ పోస్ట్ వద్ద భారత్కు అప్పగించారు.
బీఎస్ఎఫ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఉదయం సుమారు 10:30 గంటలకు అట్టారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద పూర్ణం కుమార్ను అప్పగింపు ప్రక్రియ చేపట్టారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం, శాంతియుతంగా ఈ మార్పిడి పూర్తి అయిందని అధికారులు తెలిపారు. పూర్ణం కుమార్ను బీఎస్ఎఫ్ వైద్య బృందం పరిశీలించిన అనంతరం ఆయన్ను తన విధి ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.
పూర్ణం కుమార్ షా ప్రస్తుతం ఫిరోజ్పూర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న నిబంధనలు పాటించకుండానే ఆయన పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బీఎస్ఎఫ్, పాక్ రేంజర్లు పరస్పరం సంప్రదించి విడిపోతారు. కానీ ఈసారి పరిస్థితి విభిన్నంగా ఉండటంతో ఆయన విడుదల ఆలస్యం అయింది.
కారణం ఏంటంటే, అప్పటి రోజుల్లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండేవి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. పాక్ ఈ వ్యవహారాన్ని స్వల్పకాలిక రాజకీయ లబ్దికి ఉపయోగించుకునే అవకాశం ఉందని అంచనాలు ఉండటంతో జవాన్ విడుదల ఆలస్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పూర్ణం కుమార్ సురక్షితంగా తిరిగొచ్చిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ అధికారులతో పాటు కుటుంబసభ్యులు, సహచరులు ఆనందం వ్యక్తం చేశారు.
This post was last modified on May 14, 2025 1:08 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…