Political News

మొత్తానికి పాక్ చెర నుంచి విడుదలైన బీఎస్ఎఫ్ జవాన్

పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. గత నెల 23న పొరపాటున అంతర్జాతీయ రేఖను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన ఆయన అక్కడి రేంజర్లకు చిక్కారు. దాంతో 3 వారాల పాటు పాక్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. చివరికి బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం అతన్ని అట్టారీ చెక్ పోస్ట్ వద్ద భారత్‌కు అప్పగించారు.

బీఎస్ఎఫ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఉదయం సుమారు 10:30 గంటలకు అట్టారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద పూర్ణం కుమార్‌ను అప్పగింపు ప్రక్రియ చేపట్టారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం, శాంతియుతంగా ఈ మార్పిడి పూర్తి అయిందని అధికారులు తెలిపారు. పూర్ణం కుమార్‌ను బీఎస్ఎఫ్ వైద్య బృందం పరిశీలించిన అనంతరం ఆయన్ను తన విధి ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.

పూర్ణం కుమార్ షా ప్రస్తుతం ఫిరోజ్‌పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న నిబంధనలు పాటించకుండానే ఆయన పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బీఎస్ఎఫ్, పాక్ రేంజర్లు పరస్పరం సంప్రదించి విడిపోతారు. కానీ ఈసారి పరిస్థితి విభిన్నంగా ఉండటంతో ఆయన విడుదల ఆలస్యం అయింది.

కారణం ఏంటంటే, అప్పటి రోజుల్లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండేవి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. పాక్ ఈ వ్యవహారాన్ని స్వల్పకాలిక రాజకీయ లబ్దికి ఉపయోగించుకునే అవకాశం ఉందని అంచనాలు ఉండటంతో జవాన్ విడుదల ఆలస్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పూర్ణం కుమార్ సురక్షితంగా తిరిగొచ్చిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ అధికారులతో పాటు కుటుంబసభ్యులు, సహచరులు ఆనందం వ్యక్తం చేశారు.

This post was last modified on May 14, 2025 1:08 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bsf Jawan

Recent Posts

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

1 hour ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

1 hour ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

2 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

3 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

4 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

5 hours ago