పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. గత నెల 23న పొరపాటున అంతర్జాతీయ రేఖను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన ఆయన అక్కడి రేంజర్లకు చిక్కారు. దాంతో 3 వారాల పాటు పాక్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. చివరికి బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం అతన్ని అట్టారీ చెక్ పోస్ట్ వద్ద భారత్కు అప్పగించారు.
బీఎస్ఎఫ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఉదయం సుమారు 10:30 గంటలకు అట్టారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద పూర్ణం కుమార్ను అప్పగింపు ప్రక్రియ చేపట్టారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం, శాంతియుతంగా ఈ మార్పిడి పూర్తి అయిందని అధికారులు తెలిపారు. పూర్ణం కుమార్ను బీఎస్ఎఫ్ వైద్య బృందం పరిశీలించిన అనంతరం ఆయన్ను తన విధి ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.
పూర్ణం కుమార్ షా ప్రస్తుతం ఫిరోజ్పూర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న నిబంధనలు పాటించకుండానే ఆయన పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బీఎస్ఎఫ్, పాక్ రేంజర్లు పరస్పరం సంప్రదించి విడిపోతారు. కానీ ఈసారి పరిస్థితి విభిన్నంగా ఉండటంతో ఆయన విడుదల ఆలస్యం అయింది.
కారణం ఏంటంటే, అప్పటి రోజుల్లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండేవి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. పాక్ ఈ వ్యవహారాన్ని స్వల్పకాలిక రాజకీయ లబ్దికి ఉపయోగించుకునే అవకాశం ఉందని అంచనాలు ఉండటంతో జవాన్ విడుదల ఆలస్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పూర్ణం కుమార్ సురక్షితంగా తిరిగొచ్చిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ అధికారులతో పాటు కుటుంబసభ్యులు, సహచరులు ఆనందం వ్యక్తం చేశారు.
This post was last modified on May 14, 2025 1:08 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…