Political News

జగన్ లిక్కర్ బ్యాచ్: ఇద్దరికి బెయిల్.. ఒకరి పట్టివేత

వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి, అప్పటి సీఎం జగన్‌కు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ, విచారణ సాగుతున్న సమయంలో మైసూరులో పోలీసుల చేతికి చిక్కిన ప్రముఖ ఆడిటర్ బాలాజీ గోవిందప్పకు మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వనింది.

వాస్తవానికి, ముగ్గురు కూడా గత రెండు వారాలుగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, ఆయన పలువురు కీలక నిందితుల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను కూడా కేసులో నిందితులుగా పేర్కొన్నారు. వెంటనే వారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.

దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత అక్కడ కూడా బెయిల్ మంజూరు కాలేదు. పలు మార్లు పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే తాజాగా మరోసారి చివరి ప్రయత్నంగా వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు పలు నిబంధనలు, షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

విచారణకు పూర్తిగా సహకరించాలి, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలి, సాక్షులను బెదిరించరాదు, అధికారుల పిలుపు మేరకు ఎప్పుడైనా విచారణకు హాజరుకావాలన్న షరతులతో బెయిల్ మంజూరైంది. అయితే అప్పటికే బాలాజీ గోవిందప్ప మైసూరులో అరెస్ట్ కావడంతో, ఆయనకు మాత్రం బెయిల్ నిరాకరించారు.

ఈ నేపథ్యంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు మాత్రమే శుక్రవారం వరకు పరిమితమైన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటివరకు వారిని పోలీసులు అరెస్ట్ చేయరాదని, దురుసుగా ప్రవర్తించకూడదని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు సహకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది.

Satya

Recent Posts

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…

2 hours ago

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

3 hours ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

3 hours ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

5 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

6 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

6 hours ago