అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ల మధ్య తానే యుద్ధాన్ని నిలువరించా నని తాజాగా చెప్పుకొచ్చారు. యూఎస్ మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అతి పెద్ద అణుయుద్ధాన్ని నిలువరించినట్టు తెలిపారు. భారత్-పాకిస్థాన్లు రెండూ అణుయుద్ధానికి దిగే అవకాశం ఉందని గమనించి.. తానే యుద్ధాన్ని నిలువరించేలా వారిని ఒప్పిం చానని పేర్కొన్నారు. ఇరు దేశాలను అత్యంత ఘనమైన దేశాలుగా పేర్కొన్న ట్రంప్.. తన సంబంధాలు రెండు దేశాలతోనూ కొనసాగుతాయన్నారు.
భారత్-పాక్ల మధ్య యుద్ధ నివారణలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రుబియోలు విశేషంగా కృషి చేశా రని ట్రంప్ పేర్కొన్నారు. భారత్-పాక్లు రెండు తనకు మిత్రదేశాలని.. రెండు దేశాల్లోనూ బలమైన రాజకీయ శక్తి ఉందని.. పాలనా శక్తి ఉన్నాయని తెలిపారు. తాను యుద్ధాన్ని నిలువరించాలని.. కాల్పుల విరమణను పాటించాలని ఇరు దేశాలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిపారు. దీంతో లక్షలాది మంది ఇరు దేశాల పౌరుల ప్రాణాలను కాపాడానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ ప్రపంచానికి కూడా మేలు చేశానన్నారు.
“యుద్ధాన్ని నివారించడంలో నేను వాడిన వాణిజ్యం జోక్యం గతంలో ఎవరూ వినియోగించలేదు“ అని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలతోనూ.. భవిష్యత్తులోనూ చర్చలు జరుపుతామన్నారు. అణు యుద్ధమే జరిగి ఉంటే.. ఊహించని పెను ఉపద్రవాన్ని మనం చూసి ఉండేవారని, లక్షల మంది ప్రజలు చనిపోయి ఉండేవారని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ.. తను అలా కాకుండా చేశానని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాలతోనూ తన వాణిజ్య కార్యక్రమాలు కొనసాగుతాయని ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో మున్ముందు ఇరు దేశాలతో టచ్లో ఉంటామన్నారు.
కాగా.. దాయాదితో మన దేశం కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ జోక్యంపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. పైగా అమెరికా జోక్యం మనకు అవసరం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పినట్టు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మరోవైపు పాకిస్థాన్.. ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేయడం గమనార్హం.
This post was last modified on May 13, 2025 10:32 am
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…