ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఘనంగా సత్కరించి.. వారిపై కానుకలు కురిపించారు. గత రాత్రే పిఠాపురం నుంచి ప్రత్యేక బస్సుల్లో 20 మంది స్టాఫ్ నర్సులను మంగళగిరిలోని జనసేన పార్టీప్రధాన కార్యాలయానికి, తన అధికారిక కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు. సోమవారం.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. వారి సేవలను కొనియాడారు.
ముఖ్యంగా తన కుమారుడు మార్క్ శంకర్.. ఇటీవల సింగపూర్లో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సందర్భాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నర్సులు వెన్నంటి ఉండి.. తన కుమారుడిని కాపాడారని తెలిపారు. వైద్యులు మందుల ద్వారా రోగుల ప్రాణాలను కాపాడితే.. నర్సులు తమ సేవల ద్వారా ప్రాణం పోస్తారని కొనియాడారు. నర్సుల సేవలకు ఎంత ఇచ్చినా రుణం తీరదన్న ఆయన.. నర్సుల సేవలు ఎంత కష్టంగా ఉంటాయో.. వారు వాటిని ఎంత ఇష్టంగా చేస్తారో కూడా తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నర్సులు చేసిన సేవలను పవన్ కల్యాణ్ కొనియాడారు. అనంతరం.. వారికి కానుకలు ఇచ్చారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన 12 మంది నర్సులను ఘనంగా సత్కరించి.. వారితో ఫొటోలు దిగారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే తన నియోజకవర్గంలో 100 పడకలతో అత్యాధుని వసతులతో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కానుందని తెలిపారు. కాగా.. ఇటీవల ఈ ఆసుపత్రికి శంకు స్థాపన చేసిన విషయం తెలిసిందే.
This post was last modified on May 12, 2025 5:36 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…