Political News

పిఠాపురం న‌ర్సుల‌కు ప‌వ‌న్ కానుక‌లు.. ఎందుకంటే

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌నిచేస్తున్న స్టాఫ్ న‌ర్సుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించి.. వారిపై కానుక‌లు కురిపించారు. గ‌త రాత్రే పిఠాపురం నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల్లో 20 మంది స్టాఫ్ న‌ర్సుల‌ను మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీప్ర‌ధాన కార్యాల‌యానికి, త‌న అధికారిక కార్యాల‌యానికి వారిని తీసుకువ‌చ్చారు. సోమ‌వారం.. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. వారి సేవ‌ల‌ను కొనియాడారు.

ముఖ్యంగా త‌న కుమారుడు మార్క్ శంకర్‌.. ఇటీవ‌ల సింగ‌పూర్‌లో అగ్నిప్ర‌మాదంలో చిక్కుకున్న సందర్భాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో న‌ర్సులు వెన్నంటి ఉండి.. త‌న కుమారుడిని కాపాడార‌ని తెలిపారు. వైద్యులు మందుల ద్వారా రోగుల ప్రాణాల‌ను కాపాడితే.. న‌ర్సులు త‌మ సేవ‌ల ద్వారా ప్రాణం పోస్తార‌ని కొనియాడారు. న‌ర్సుల సేవ‌లకు ఎంత ఇచ్చినా రుణం తీర‌ద‌న్న ఆయ‌న‌.. న‌ర్సుల సేవ‌లు ఎంత క‌ష్టంగా ఉంటాయో.. వారు వాటిని ఎంత ఇష్టంగా చేస్తారో కూడా తన‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు.

అదేస‌మ‌యంలో క‌రోనా స‌మ‌యంలో త‌మ ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా న‌ర్సులు చేసిన సేవలను ప‌వ‌న్ క‌ల్యాణ్ కొనియాడారు. అనంత‌రం.. వారికి కానుక‌లు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా అత్యుత్త‌మ సేవలు అందించిన 12 మంది న‌ర్సుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించి.. వారితో ఫొటోలు దిగారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. త్వ‌ర‌లోనే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 100 ప‌డ‌క‌ల‌తో అత్యాధుని వ‌స‌తుల‌తో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కానుంద‌ని తెలిపారు. కాగా.. ఇటీవ‌ల ఈ ఆసుప‌త్రికి శంకు స్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on May 12, 2025 5:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

4 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago