ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఘనంగా సత్కరించి.. వారిపై కానుకలు కురిపించారు. గత రాత్రే పిఠాపురం నుంచి ప్రత్యేక బస్సుల్లో 20 మంది స్టాఫ్ నర్సులను మంగళగిరిలోని జనసేన పార్టీప్రధాన కార్యాలయానికి, తన అధికారిక కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు. సోమవారం.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. వారి సేవలను కొనియాడారు.
ముఖ్యంగా తన కుమారుడు మార్క్ శంకర్.. ఇటీవల సింగపూర్లో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సందర్భాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నర్సులు వెన్నంటి ఉండి.. తన కుమారుడిని కాపాడారని తెలిపారు. వైద్యులు మందుల ద్వారా రోగుల ప్రాణాలను కాపాడితే.. నర్సులు తమ సేవల ద్వారా ప్రాణం పోస్తారని కొనియాడారు. నర్సుల సేవలకు ఎంత ఇచ్చినా రుణం తీరదన్న ఆయన.. నర్సుల సేవలు ఎంత కష్టంగా ఉంటాయో.. వారు వాటిని ఎంత ఇష్టంగా చేస్తారో కూడా తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నర్సులు చేసిన సేవలను పవన్ కల్యాణ్ కొనియాడారు. అనంతరం.. వారికి కానుకలు ఇచ్చారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన 12 మంది నర్సులను ఘనంగా సత్కరించి.. వారితో ఫొటోలు దిగారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే తన నియోజకవర్గంలో 100 పడకలతో అత్యాధుని వసతులతో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కానుందని తెలిపారు. కాగా.. ఇటీవల ఈ ఆసుపత్రికి శంకు స్థాపన చేసిన విషయం తెలిసిందే.
This post was last modified on May 12, 2025 5:36 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…