రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి దాదాపు 11 మాసాలు పూర్తయ్యాయి. ఈ పదకొండు మాసాల్లో చిన్న పాటి ఉపద్రవం కాదు కదా.. విభేదం కూడా రాలేదు. క్షేత్రస్థాయి చిన్నపాటి గొడవలు.. దూరాలు.. ఉన్నా.. ఉన్నత స్థాయిలో మాత్రం కలివిడి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కూటమి బలంగానే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక, పదవుల పంపకం నుంచి గౌరవ మర్యాదల వరకు కూడా.. కూటమి పార్టీల మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు.
పరస్పర సహకారం.. మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి మూడు పార్టీలను ఐక్యంగా ఉంచుతున్నా యి. ఇక, నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో సహజంగానే కూటమి పార్టీల మధ్య అనైక్యత ఉంటుందని.. వస్తుందని అంచనా వేసుకున్న ప్రతిపక్షాలకు పెద్దగా ఒరిగింది ఏమీలేదు. ఎందుకంటే.. సేమ్ ఈక్వేషన్.. సేమ్ఫార్ములాను సీఎం చంద్రబాబు పాటిస్తున్నారు.
ఇప్పటి వరకు పంచిన 100కు పైగా నామినేటెడ్ పదవుల్లో బీజేపీ, జనసేనలకు ఆయా పార్టీల ప్రజాప్రతి నిధుల ఆధారంగా సీట్లు ఇస్తున్నారు. ప్రతి సారీ జనసేనకు 3 తగ్గకుండా చూసుకుంటున్నారు. బీజేపీకి ఖచ్చితంగా ఒక సీటును ఇస్తున్నారు. ఇది కూటమి ఐక్యతను మరోసారి రుజువు చేసింది. అంతేకాదు.. పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆయా ఎంపికలను కూడా వారికే వదిలేస్తున్నారు. ఇది కూడా కూటమిలో గట్టి ఐక్యతను చాటుతోంది.
ఏపీ వంటి కులాల సంకటం, కుల ప్రాధాన్య రాజకీయం ఉన్న రాష్ట్రాల్లో ఏ రెండు పార్టీలు కూడా ఉమ్మడి కలిసి ముందుకు సాగడం అనేది ఎక్కువ కాలం ఉంటుందనే చర్చ లేదు. కానీ.. ప్రస్తుతం ఏర్పడిన కూటమిలో ఈ ఐక్యత మాత్రం కొనసాగుతోంది. ఎవరు దీనిని నిలబెడుతున్నారు? అనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయి నాయకులకు మాత్రం బలమైన సంకేతాలు అయితే.. అందుతున్నాయి. దీంతో చిన్నపాటి తేడాలు ఉన్నా.. నాయకులు కలిసి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
This post was last modified on May 19, 2025 9:08 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…