అయితే.. అతి చేయడం, లేకపోతే సైలెంట్ అయిపోవడం.. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంగా మారింది. దీంతో నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ప్రజలు ప్రతిపక్ష నాయకుల ను ఆశ్రయిస్తున్నారు. ఉదాహరణకు తిరువూరు, సత్యవేడు, కడప సహా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే.. ఈ ఎమ్మెల్యేలు ఉంటే దూకుడుగా లేకపోతే.. మౌనంగా ఉంటున్నారు.
తిరువూరు ఎమ్మెల్యే విషయం అందరికీ తెలిసిందే. ఆయన వివాదాలకు కేరాఫ్గా మారారు. అధిష్టానం హెచ్చరించడంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన మకాంను కూడా హైదరాబాద్కు మార్చేసుకున్నారని తెలిసింది. ఇక, కడపలోనూ ఎమ్మెల్యే మాధవీరెడ్డి దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. తన సొంత పార్టీ నాయకులపైనా ముక్కుసూటిగా వ్యవహరించి వివాదాలు తెచ్చుకున్నారు. దీంతో కొన్ని రోజుల కిందట నారా లోకేష్ హెచ్చరించారు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయారు.
ఇక, సత్యవేడు ఎమ్మెల్యే తీరు వేరేగా ఉంది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత.. కేసు నమోదైంది. మొత్తంగా ఆయన ఆ కేసు నుంచి బయటకు వచ్చారు. కానీ, నియోజకవర్గానికి దూరంగా చెన్నై, బెంగళూరుకు పరిమితం అయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంలోనూ ప్రజలకు ఎమ్మెల్యే దూరమై మయ్యారన్న చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు చక్రం తిప్పుతున్నా.. ప్రజలు ఆయనను పట్టించు కోవడం లేదు.
ఈ నియోజకవర్గాలు పైకి కనిపిస్తున్నా.. ఇంకా చాలా వరకు నియోజకవర్గాల్లో నాయకులు దూకుడుగా ఉండడం.. అదిష్టానం హెచ్చరించడంతో మౌనంగా ఉండిపోవడం కామన్ అయింది. ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అయింది. తిరువూరు, సత్యవేడు నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయడంతో ఇక్కడివారంతా వైసీపీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. సత్యవేడులో అయితే.. తిరుపతి ఎంపీ హవా కొనసాగుతోంది. సో.. అలా కాకుండా.. నాయకులు ఆలోచించి అడుగులు వేస్తే..ఈ సమస్యలు వచ్చేవి కావన్నది పరిశీలకుల అంచనా.
This post was last modified on May 19, 2025 9:08 am
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…