Political News

ఈ విష‌యం అప్పుడే చెప్పా.. నేత‌ల‌కు జ‌గ‌న్ క్లాస్.. !

వైసీపీ నాయ‌కుల‌పై కేసులు న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో కేసులు ప‌డ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయ‌కులు, అప్ప‌ట్లో వైసీపీకి అనుకూలంగా ప‌నిచేశార‌ని చెప్పుకొనే ఐపీఎస్ అధికారు లు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. పీఎస్ ఆర్ ఆంజ‌నేయులు ఏకంగా జైలు జీవితం గ‌డుపుతున్నారు. ఇంకా మ‌రికొంద‌రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. వారి ప్రొఫైల్‌తో సంబంధం లేకుండా. వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నులే శాపంగా ప‌రిణ‌మించాయి.

ఇక‌, నాయ‌కుల ప‌రిస్థితి వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వారు కూడా బెయిల్ ద‌క్క‌క చిక్కులు ప‌డుతు న్నారు. అయితే.. ఈ విష‌యాల‌న్నీ.. తాజాగా జ‌గ‌న్ నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. జ‌గ‌నే ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ‘ఈ విష‌యం అప్పుడే చెప్పా’ అంటూ.. జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోవడంతోనే ఇలా జ‌రిగింద‌ని.. కేసులు పెడ‌తార‌ని తాను ఇదివ‌ర‌కే చెప్పాన‌ని జ‌గ‌న్ ముక్తాయించారు.

“మ‌నం అన్నీ మంచిగానే చేశాం. అయినా.. మ‌న‌పై రాజ‌కీయం జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల‌కు ముందే నేను చెప్పా. పార్టీ గెలుపుకోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని చెప్పా. కానీ.. జ‌రిగిపోయింది. ఇప్ప‌టికైనా పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప‌నిచేయాలి. మ‌న‌మే అధికారంలోకి వ‌స్తాం.. అని నేను చెబుతున్నా.. మీరు కూడా ఆదిశ‌గా అడుగులు వేయాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. మ‌నం అధికారంలోకి వ‌చ్చి తీరాలి. అప్ప‌టి వ‌ర‌కు కేసులు త‌ప్ప‌వు.” అని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

అయితే.. అధికారంలోకి వ‌చ్చినా.. రాకున్నా.. కొన్ని కేసులు మాత్రం జ‌గ‌న్‌ను వెంటాడుతున్నాయి. కానీ.. పార్టీ నాయ‌కుల‌కు కొంత ఊర‌ట ల‌భించి ఉండేది. వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. ఆయ‌న చెప్పిన‌ట్టు ఇబ్బందులు ఉండేవి కాక‌పోయినా.. అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితిని మాత్రం నాయ‌కులు చేజేతులా పాడుచేసుకున్నార‌న్న‌ది వాస్త‌వం. ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డం.. వారిపైనే దూష‌ణ‌ల‌కు దిగ‌డం(జీడీ నెల్లూరులో ఇదే జ‌రిగింది) వంటివి వైసీపీని ప్ర‌జ‌ల‌కు దూరం చేశాయి. ఈ విష‌యాన్ని గుర్తించి.. ఉంటే ఇప్ప‌టికైనా వైసీపీకి మంచిరోజులు వ‌స్తాయని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on May 12, 2025 11:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

4 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago