Political News

ఇస్రో కేంద్రాలు, పోర్టుల వద్ద హై అలర్ట్

పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు వద్ద భద్రతను ఓ రేంజికి పెంచేసింది. దాదాపుగా పోర్టులన్నీ సరిహద్దుల వెంటే ఉన్న నేపథ్యం… వాటి నుంచే మన నావికా దళం ప్రత్యర్థి దేశంపై విరుచుకుపడుతుండటం, విదేశీ వాణిజ్యానికి పోర్టులు కీలక కేంద్రాలుగా కొనసాగుతున్న నేపథ్య్లంలో వాటికి ఎంతమాత్రం నష్టం జరగని రీతిలో భారత్ పటిష్ట చర్యలు చేపట్టింది  భారత్ లోని పోర్టుల ద్వారా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో పోర్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు.

ఇక భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు (ఇస్రో) కూడా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించిన భారత్.. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా విజయ వంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. ఇటీవలి కాలంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఏమాత్రం తీసిపోని రీతిలో కూడా ఇస్రో సాగుతోంది. అంంతేకాకుండా మన చేతిలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పని చేయాలంటే కూడా అంతరిక్షంలోని ఉపగ్రహాలే కీలక కదా. ఈ క్రమంలో భారత్ కు చెందిన ఇస్రో కేంద్రాలను పాక్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

భారత్ తో ఇస్రో ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉండగా… ఉపగ్రహాల ప్రయోగాలకు ముఖ్య కేంద్రంగా ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలోని శ్రీహరికోటలోని షార్ కీలకంగా పనిచేస్తోంది. ఈ రెండు కేంద్రాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇస్రోకు 11 కేంద్రాలు ఉన్నాయి. పాక్ తో యుద్ధం నేపథ్యంలో ఈ అన్ని కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కేంద్రాలన్నీ ఇప్పటికే సిీఐఎస్ఎఫ్ భద్రతలో ఉండగా…యుద్ధం నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ బలగాలను ఆయా కేంద్రాల వద్ద డబుల్ చేశారు. ఇక పోర్టుల వద్ద భద్రతను రెండో స్థాయికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం  తీసుకుంది. 

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

2 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

5 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

5 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

7 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

9 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

10 hours ago